రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు అనేవి అనౌన్స్ చేసి పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తున్న ప్రభాస్.. షూటింగ్ లలో ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ప్రభాస్ యొక్క ఆదిపురుష్ సినిమా అనేది పూర్తయ్యింది. అదే విధంగా ప్రస్తుతం ఒక్కే సమయంలో రెండు సినిమా షూటింగ్స్ ఏవి చేస్తున్నాడు. అందులో ఒక్క సాలార్.
Advertisement
ఇక మరో సినిమాకు ఇంకా పేరు అనేది పెట్టలేదు. దీనిని ప్రాజెక్ట్ కే అని పిలుస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ డైరెక్షన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా నిర్మాత అయిన అశ్విని దత్ ఈ మధ్యే 50 శాతం షూటింగ్ కూడా పూర్తి అయ్యింది అని తెలిపాడు . అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ కొత్త వార్త అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Advertisement
అదేంటంటే.. ఈ సినిమాలో ముగ్గురు స్టార్ హీరోలు గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు అని తెలుస్తుంది. ఇక ఆ ముగ్గురు కూడా మూడు రాగాల ఇండస్ట్రీల నుండి కావడం గమనార్హం. ఆ ముగ్గురు ఎవరంటే.. తెలుగు నుండు సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇక తమిళ్ నుండి సూర్య.. అలాగే మలయాళం నుండి దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు అని సమాచారం. కానీ ఇందులో ఎంత నిజం ఉంది అనేది మాత్రం తెలియదు.
ఇవి కూడా చదవండి :