Home » Brahmamgari Kalagnanam : శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం ప్రకారం 2023 నుంచి 2060 వరకు జరిగేది ఏంటో తెలుసా ?

Brahmamgari Kalagnanam : శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం ప్రకారం 2023 నుంచి 2060 వరకు జరిగేది ఏంటో తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం.. ఇప్పటివరకు చాలా విషయాలు జరిగాయి. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చాలా విషయాలను రాశారు. భవిష్యత్ లో జరుగబోయే పలు విషయాలను ముందుగానే రచించి తాలపత్ర గ్రంథాల్లో రచించి పొందుపరిచారు. కొన్ని వేల సంవత్సరాల కిందనే తాళపత్ర గ్రంథాల్లో రాశారు. అవన్ని జరిగాయి. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. బ్రహ్మంగారు చెప్పినవి ఎన్నో నిజం అవ్వడం వల్ల కాలజ్ఞానం ప్రకారం.. నీటితో దీపాలు వెలిగిస్తారని పేర్కొన్నారు. 

Also Read :  మీ మొబైల్ కి హాని చేసే చెడు అలవాట్లు ఇవే..!

Advertisement

నీటితో కరెంట్ ని ఉత్పత్తి చేయడం అన్నమాట ఎద్దులు లేకుండానే బండ్లు నడుస్తాయని చెప్పారు. అన్ని యంత్ర వాహనాలే వచ్చాయి. కాశీపట్నం 40 రోజుల పాటు పాడు బడుతుంది అని చెప్పారు. ఓ వితంతువు 16 ఏళ్ల పాటు ఈ దేశాన్ని ఏలుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంతో చెప్పారు. తెరమీది బొమ్మలు గద్దెనెక్కుతాయి అన్నారు. రాచరికాలు నశిస్తాయి. రాజుల పాలన నశిస్తుందని, జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని, హైదరాబాద్ లో హిందూ, ముస్లింలు ఒకరిని మరొకరు నరుక్కొని చనిపోతారని, మతకలహాలు చెలరేగుతాయని, దేవస్థానాలు పాపాత్ముల వల్ల నాశనం అవుతాయని, దేవతా విగ్రహాలు దొంగిలించబడుతాయని చెప్పారు. చిత్ర, విచిత్రమైన యంత్రాలు పుట్టుకొస్తయని, ఎన్ని యంత్రాలు పుట్టుకొచ్చినా చావుకు, పుట్టకకు మాత్రం ఎలాంటి యంత్రాన్ని, సూత్రాన్ని కనిపెట్టలేరని చెప్పారు. సృష్టిని మార్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమవుతాయి. గట్టివాడైనా పొట్టివాడు దేశాన్ని పాలిస్తాడని చెప్పారు. కపట యోగులు విపరీతంగా పెరుగుతారని, ప్రజలు మోసపోతారని చెప్పారు. 

Advertisement

Also Read :  ప్రయాణికులకు టీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. ఇకపై బస్సుల్లో ఉచితంగా వైఫై..!

అడవి మృగాలు గ్రామాలు, పట్టణాల్లో ప్రవేశించి మనుషులను చంపుతాయన్నారు. కరోనా వ్యాధి గురించి కడూా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. కోరంకి అను జబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తూటి చచ్చేరయ్యా అంటూ కాలజ్ఞానంలో ఈ వ్యాధి గురించి ప్రస్తావించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడూ రాష్ట్రాన్ని పాలిస్తారనే అంశాన్ని కాలజ్ఞానంలో పొందుపరిచారు. 2029 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీఎం అవుతారట. తెలుగు రాష్ట్రాన పవనుడు వచ్చేనయ్యా.. రాజు వారసత్వం నశించెనయ్య అని తన కాలజ్ఞానం లో రాశారు. కర్నూలు జిల్లాలోని యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్లను మింగితాడని బ్రహ్మంగారు చెప్పారు. 2028 నాటికి ప్రపంచంలోనే అగ్రదేశంగా భారత్ నిలుస్తుందని చెప్పారు. 2034లో ప్రపంచ వినాశనం తప్పదని కాలజ్ఞానంలో చెప్పారు. యుద్ధాలు, భూకంపాలు వచ్చి ఈ ప్రపంచం వినాశనం అవుతుందన్నారు. కొత్త కొత్త వైరస్ లు వచ్చి క్షణాల్లోనే మనుసులు మరణిస్తారని, భూమి మీద మనుగడ దినదిన గండంగా ఉంటుందని చెప్పారు.

Also Read :  బ్రహ్మంగారి కాలజ్ఞానం: 2023 జరిగేది ఇదేనట..!

Visitors Are Also Reading