Home » IPL 2022 Mega Auction : విధ్వంస‌క‌ర‌మైన ఆట‌గాళ్ల‌తో గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టు

IPL 2022 Mega Auction : విధ్వంస‌క‌ర‌మైన ఆట‌గాళ్ల‌తో గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టు

by Anji
Ad

ఐపీఎల్ 2022 సీజ‌న్ ద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన గుజ‌రాత్ టైటాన్స్ ఫిబ్ర‌వ‌రి 12, 13 తేదీల్లో జ‌రిగిన మెగావేలంలో చాలా చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హరించి టీ-20ల‌కు కావాల్సిన అస‌లు సిస‌లైన జ‌ట్టును ఎంచుకుంది. ఈ జ‌ట్టుకు కెప్టెన్‌గా టీమిండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్థిక్ పాండ్యాను 15 కోట్ల‌కు రికార్డు ధ‌ర వెచ్చించి గుజ‌రాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్ 15 కోట్లు, టీమిండియా యంగ్ ఓపెన‌ర్ శుభ్‌మ‌న్‌గిల్ రూ.8కోట్లు, మ‌రొక ఇద్ద‌రు డ్రాప్టెడ్ ప్లేయ‌ర్లుగా ఎంచుకుంది.

వీరిపై ఏకంగా రూ.38కోట్లు వెచ్చించి మిగ‌తా జ‌ట్ల‌లో కాక‌రేపిన టైటాన్స్ భారీ హిట్ట‌ర్లే టార్గెట్‌గా వేలం బ‌రిలోకి దిగింది. ఫెర్గూస‌న్ 10 కోట్లు, జేస‌న్ రాయ్ 2 కోట్లు, డేవిడ్ మిల్ల‌ర్ 3 కోట్లు, మాథ్యూ వేడ్ 2.4 కోట్లు, రాహుల్ తేవాఠియా 9 కోట్లు చెల్లించి విధ్వంస‌క‌ర‌మైన వీరుల‌ను సొంతం చేసుకుంది. మెగా వేలంలో 52 కోట్లు ఖ‌ర్చు చేసి 20 మంది ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేసింది. 2022 ఐపీఎల్ ఫైట్‌లో త‌ల‌ప‌డ‌బోయే గుజ‌రాత్ టైటాన్స్ పూర్తి స్థాయి జ‌ట్టు ఆట‌గాళ్ల వివ‌రాలు తెలుసుకుందాం.

Advertisement

Advertisement

Also Read :  IPL 2022 : మెగా వేలంలో సురేష్ రైనాను ఎందుకు కొనుగోలు చేయ‌లేదో చెప్పిన సీఎస్‌కే సీఈఓ..!

రిటైన్డ్ ఆట‌గాళ్లు

హార్థిక్ పాండ్యా (15 కోట్లు)
ర‌షీద్ ఖాన్ (15 కోట్లు)
శుభ్‌మ‌న్ గిల్ (8 కోట్లు)

వేలంలో కొనుగోలు చేసిన ఆట‌గాళ్లు

పెర్గూస‌న్ (10 కోట్లు)
రాహుల్ తెవాటియా (9 కోట్లు)
మ‌హ్మ‌ద్ ష‌మీ (6.25 కోట్లు)
య‌శ్ ద‌యాల్ (3.2 కోట్లు)
ఆర్ సాయ్ కిషోర్ (3కోట్లు)
డేవిడ్ మిల్ల‌ర్ (3 కోట్లు)
అభిన‌వ్ స‌ద‌రంగ‌ని (2.6కోట్లు)
జోస‌ఫ్ (2.4 కోట్లు)
జేస‌న్ రాయ్ (2 కోట్లు)
వృద్ధిమాన్ సాహా (1.9 కోట్లు)
జ‌యంత్ యాద‌వ్ (1.70 కోట్లు)
విజ‌య్ శంక‌ర్ (1.40 కోట్లు)
డామినిక్ డ్రేక్స్ (1.10 కోట్లు)
గురుకీర‌త్ సింగ్ (50 ల‌క్ష‌లు)
వ‌రుణ్ అరోన్ (50 ల‌క్ష‌లు)
నూర్ అహ్మ‌ద్ (30 ల‌క్ష‌లు)
ద‌ర్శ‌న్ న‌ల్ఖండే (20 ల‌క్ష‌లు)
ప్ర‌దీప్ సాంగ్వాన్ (20 ల‌క్ష‌లు)
సాయి సుద‌ర్శ‌న్ (20 ల‌క్ష‌లు)

Also Read :  చరణ్ శంకర్ సినిమాలో విలన్ గా తమిళనటుడు…!

Visitors Are Also Reading