Home » నరేష్ నిద్ర లేచిదంటే చాలు అదే పని.. ఆసక్తికర కామెంట్స్ చేసిన రమ్య రఘుపతి..!

నరేష్ నిద్ర లేచిదంటే చాలు అదే పని.. ఆసక్తికర కామెంట్స్ చేసిన రమ్య రఘుపతి..!

by Anji
Ad

గత కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్- పవిత్ర లోకేష్ వ్యవహారం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వీరిద్దరూ కలిసి సహజీవనం చేయడం.. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఎంట్రీ ఇచ్చి పలు కామెంట్లు చేయడం తరుచూ చూస్తూనే ఉన్నాం. ఇటీవలే డిసెంబర్ 31, 2022న నరేష్ తన పెళ్లి గురించి ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. 

Advertisement

ముఖ్యంగా పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకొని తమ బంధం అధికారికం చేసుకోనున్నట్టు క్లారిటీ ఇచ్చారు. నరేష్ చేసిన ప్రకటనపై నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి స్పందించారు. ఎప్పుడూ లేని విధంగా నరేష్ పై సంచలన  ఆరోపణలు చేసింది. “ నేను నరేష్ పై ఆరోపణలు చేశానని.. నేను చేసిన ఆరోపణలకు సంబంధించి నా దగ్గర ఆధారాలున్నాయంటూ.. రమ్య రఘుపతి వెల్లడించింది. విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో ఉన్నదని..ఆ కేసు గురించి నేను మాట్లాడటం సరికాదు. నరేష్ ఎక్కువగా Po ర్న్ వీడియోలను చూస్తాడు. నన్ను వదిలించుకునేందుకు అక్రమ సంబంధాలు కూడా అంటగట్టాడు. చివరికీ దేవుడు లాంటి సూపర్ స్టార్ కృష్ణ గారితో కూడా ఎఫైర్ పెట్టుకున్నాను అని విమర్శలు చేశాడు. నన్ను దూషించడంతో పాటు మానసికంగా తరచూ వేదించే వాడు” అని రమ్య పేర్కొంది.  

Advertisement

Also Read :   ఒకప్పుడు పాన్ ఇండియా స్టార్ గా రాణించిన హరీష్….ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసా..?

Manam News

 

నరేష్ పలువురితో ఎఫైర్స్ పెట్టుకొని చాలా సార్లు తనకు దొరికిపోయాడు. ఇంకా దొరికినప్పుడు నరేష్ ఏకంగా తన కాళ్లు పట్టుకొని బతిమిలాడాడు అని వెల్లడించింది రమ్య రఘుపతి. నరేష్ తల్లి విజయ నిర్మల మరణించిన తరువాత ఈయన పిచ్చి వేషాలు చాలా ఎక్కువ అయ్యాయని.. ఇష్టమొచ్చనిట్టు చేసేవాడని తెలిపింది. ప్రశ్నించే వారు ఎవ్వరూ లేకపోవడంతో విచ్ఛలవిడిగా ప్రవర్తించే వాడు. తల్లి విజయనిర్మల ఉన్నప్పుడు భయంతో బయటపడే వాడు కాదని తెలిపారు. ముఖ్యంగా నరేష్ -పవిత్ర దగ్గర కావడానికి ఇదే కారణం అంటూ.. రమ్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. రమ్య చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

Also Read :  నరేష్ కు పవిత్ర దగ్గరవ్వడానికి అసలు కారణం అదేనా…? మూడో భార్య ఏం చెబుతోంది..!

Visitors Are Also Reading