Home » నా భర్తను లేపేయ్..కలిసి ఎంజాయ్ చేద్దాం.. ప్రియుడికి ఫోన్ చేసి చెప్పిన మహిళ..!!

నా భర్తను లేపేయ్..కలిసి ఎంజాయ్ చేద్దాం.. ప్రియుడికి ఫోన్ చేసి చెప్పిన మహిళ..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సమాజం మారిపోయింది.. కట్టుకున్న భర్తలను, భార్యలను కిరాతకంగా హత మారుస్తున్న ఘటనలు అనేకం చూస్తున్నాం. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన ఏం చేసినా కానీ ఘటనలు మాత్రం ఆగడం లేదు.. అక్రమ సంబంధమే ప్రాణాల మీదకు తెస్తోంది.. తాజాగా జరిగిన ఒక ఘటన అందరినీ కలవరపెడుతోంది.. మరి ఆ విషాద ఘటన వివరాలు చూద్దాం.. చిత్తూరు జిల్లాలోని బాలాజీ నగర్ కాలనీలో వడివేలు,సెల్వరాణి దంపతులు నివాసం ఉండేవారు. వీరి జీవితం సాఫీగా సాగుతున్న సందర్భంలోనే సెల్వరాణికి వచ్చిన ఆలోచన సంసారాన్ని నాశనం చేసింది.. వడివేలు ఆటో డ్రైవర్ గా పని చేస్తాడు.. సెల్వరాని అక్కడే ఒక గిన్నెల షాపులో పనిచేస్తూ ఉండేది.. ఈ విధంగా వీరి కాపురం సాఫీగా సాగుతోంది.. ఈ తరుణంలోనే సెల్వరాణి బుద్ధి గడ్డి తిన్నది.. స్థానికంగా ఫ్యాన్సీ దుకాణాన్ని నడిపే విజయ్ అనే యువకుడితో పరిచయం పెరిగింది..

Advertisement

also read:happy birthday venkatesh: వెంకటేష్ ఆ హీరోయిన్ తో అస్సలు మాట్లాడడు.. కారణం ఏంటో తెలుసా..?

Advertisement

ఇద్దరు కలిసి చట్టపట్టలేసుకొని తిరగడం స్టార్ట్ చేశారు.. ఎన్నో చీకటి బాగోతాలు నడుస్తున్నాయి.. సెల్వరాని యువకుడిని బాగా నమ్మిస్తోంది.. నువ్వంటే పిచ్చి, నువ్వు లేకుండా ఉండలేను అంటూ ప్రేమ పాఠలు చెప్పి యువకుడిని తన వైపు పూర్తిగా తిప్పేసుకుంది.. ఇలా వీరి రిలేషన్ కొనసాగుతున్న సందర్భంలో ఈ విషయం కాస్త వడివేలుకు తెలిసింది.. ఆయన సెల్వరాణిని పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు.. అయినా వినకపోవడంతో కోపంతో భార్యపై దాడి కూడా చేశాడు. అయినా బుద్ధి మార్చుకోలేదు.. ప్రియుడిని మరింత ముగ్గులోకి దింపేసుకుంది.. ఒకరోజు ప్రియుడికి కాల్ చేసి మనం బాగా ఎంజాయ్ చేయలేకపోతున్నాం, సంతోషంగా ఉండలేకపోతున్నాం, మనం హ్యాపీగా చీకటి బాగోతం నడిపించుకోవాలి అంటే నా భర్తను లేపేయాలని చెప్పింది.. దీంతో వినయ్ ప్లాన్ ప్రకారమే వడివేలుతో స్నేహం పెంచుకున్నాడు.. అలా ఇద్దరు కలిసి మద్యం సేవించేవారు..

ఒకరోజు వినయ్ పథకం ప్రకారం వడివేలును లేపేయడానికి రెండు లక్షలకు ఇద్దరినీ మాట్లాడాడు.. ప్లాన్ ప్రకారమే వడివేలును ఒక ప్లేస్ కు పిలిచాడు.. ఇద్దరు బాగా మద్యం తాగారు.. వడివేలుకు కాస్త మద్యం ఎక్కువైంది.. దీంతో వినయ్ అదే బాటిల్ తో వడివేలు తలపై గట్టిగా కొట్టాడు.. తర్వాత వచ్చిన ఇద్దరు వారితో తెచ్చుకున్న కత్తితో 23 సార్లు పొడిచారు.. దీంతో వడివేలు మరణించాడు. విషయం కాస్త వడివేలు కుటుంబ సభ్యులకు తెలియడంతో కన్నీరుగా విలపించారు.. వడివేలు భార్య సెల్వరాని యాక్టింగ్ మాత్రం వీర లెవెల్ లో ఉంది.. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వారి స్టైల్లో విచారించారు. జరిగిందంతా చెప్పడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

also read:Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి

 

Visitors Are Also Reading