Home » జయప్రద-శ్రీదేవిల మధ్య గొడవకు కారణం.. ఆమె మాటలేనా.. అంత దారుణంగా..!!

జయప్రద-శ్రీదేవిల మధ్య గొడవకు కారణం.. ఆమె మాటలేనా.. అంత దారుణంగా..!!

Ad

కాలం మారిపోతుంది.. జ్ఞాపకాలు మారిపోతున్నాయి.. కొందరు మనుషులు కూడా కనుమరుగై పోతుంటారు. ఎన్ని సంవత్సరాలు గడిచినా మనం మర్చిపోలేని వ్యక్తులు కొంతమంది ఉంటారు. చిత్రపరిశ్రమలో శ్రీదేవి, జయప్రధ ఆ కోవకు చెందిన వారే. వీరిద్దరిలో ఎవరు ఎవరికి సీనియర్ అనే ప్రశ్న ఎదురైతే శ్రీదేవే సీనియర్ అని చెప్పాలి. ఎందుకంటే నాలుగు సంవత్సరాల వయసులోనే శ్రీదేవి యాక్టింగ్ మొదలు పెట్టింది. 1975 లో అనురాగాలు సినిమాలో హీరోయిన్ గా కెరియర్ మొదలుపెట్టారు. అయితే శ్రీదేవి కంటే ఒక సంవత్సరం ముందే భూమి కోసం సినిమా ద్వారా జయప్రద హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఎన్టీఆర్ సరసన నటించిన అడవి రాముడు సినిమా తో జయప్రద స్టార్ హీరోయిన్ అయ్యారు. శ్రీదేవి పదహారేళ్ళ వయసు సినిమా లో నటించి గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. జయప్రద డేట్ లు కుదరకపోతే శ్రీదేవి, శ్రీదేవి డేట్లు కుదరకపోతే జయప్రద ఇలా వాళ్ళిద్దరి మధ్య పోటీ ఏర్పడింది. వీరిద్దరూ అందరు స్టార్ హీరోలతో నటించారు. జయప్రద,శ్రీదేవి మధ్య మాటలు తగ్గిపోయాయి. దేవత,ముందడుగు, కృష్ణార్జున యుద్ధం లో వీరిద్దరు కలిసి నటించినా కూడా వారి మధ్య సాన్నిహిత్యం కేవలం నటించే వరకు మాత్రమే ఉండేది. సినిమా లో షాట్ అయిపోయిన తర్వాత ఎడమొహం పెడమొహంగా ఉండేవారు.

Advertisement

Advertisement

రాఘవేంద్ర రావు సహాయం కారణంగా శ్రీదేవి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. జయప్రద, శ్రీదేవి మధ్య గ్యాప్ పెరగడానికి అసలు కారణం ఏంటంటే.. ఒక ప్రెస్ మీట్లో నేను నాచురల్ అందగత్తెని ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు అని స్టేట్మెంట్ ఇచ్చారట జయప్రద. ఆ మాట తన గురించే అన్నారని శ్రీదేవి ఆవిడితో మాట్లాడటం మానేసారు. ఈ మాటలే వారిద్దరి మధ్య నిప్పురాజేశాయి. ఏదైనా సందర్భంలో పలకరించినా కూడా శ్రీదేవి ముభావంగా ఉండడంతో జయప్రద కూడా అలాగే ఉండాల్సి వచ్చింది.

అడవి సింహాలు సినిమా హిందీలో జానీ దోస్త్ పేరుతో తెరకెక్కించారు. హిందీలో కూడా శ్రీదేవి,జయప్రద లను హీరోయిన్లుగా అడిగారు. కానీ శ్రీదేవి తో నటించడం ఇష్టం లేక జయప్రద నాకు డేట్స్ ఖాళీగా లేవని చెప్పింది. దీంతో వారిద్దరి మధ్య దూరం ఇంకా పెరిగింది. వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి మక్సల్ షూటింగ్ సమయంలో జితేంద్ర వీరిద్దరిని ఒకే గదిలో బంధించి బయట తాళం వేశారట. గంట సేపు ఒకే గదిలో ఉన్నారే తప్ప వారిద్దరు ఒకరికొకరు మాట్లాడుకోలేదు అలా దాదాపు 30 సంవత్సరాల పాటు జయప్రద, శ్రీదేవి లు మాటలు లేకుండానే గడిపేశారు.

ALSO READ;

చెల్లి దారిలోనే చందమామ…సినిమాలకు ఇక సెలవు…!

దేవి నాగ‌వల్లితో లొల్లి హీరోల‌కు క‌లిసివ‌స్తుందా..? నెట్టింట ట్రోల్స్..!

 

Visitors Are Also Reading