Home » టీచర్లకు కేసీఆర్ సర్కార్ శుభవార్త.. పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం

టీచర్లకు కేసీఆర్ సర్కార్ శుభవార్త.. పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం

by Bunty
Ad

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. తెలంగాణ ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల బదిలీల కోసం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి అరుణ జీవో నంబర్ 5 జారీ చేశారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది.

Advertisement

రేపు ఖాళీల వివరాలను ప్రకటించి 28 నుంచి ఈ నెల 30 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి 4 వరకు బదిలీల ప్రక్రియ కొనసాగనుంది మార్చి 5 నుంచి 19 వరకు ఆప్పీళ్లను స్వీకరించి పరిష్కరిస్తారు. బదిలీలన్నీ వెబ్ కౌన్సిలింగ్ విధానంలోనే ఉంటాయని జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐదేళ్లు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులను, మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న టీచర్లను దరఖాస్తు చేసుకోకపోయినా బదిలీ చేయనున్నట్టు జీవోలో వెల్లడించారు.

Advertisement

మూడేళ్లలో ఉద్యోగ విరమణ చేయనున్న టీచర్లు వారు కోరుకుంటే తప్ప బదిలీ చేయరు. బాలికల పాఠశాలల్లో 50 ఏళ్ల లోపు పురుష ఉపాధ్యాయులు ఉంటే బదిలీ చేసి, మహిళలను నియమిస్తారు. ఒకవేళ మహిళ ఉపాధ్యాయులు లేకపోతే 50 ఏళ్ళు దాటిన పురుషులను నియమిస్తారు. ఉపాధ్యాయులకు డిఈవో, ప్రధాన ఉపాధ్యాయులకు ఆర్జేడి బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తారు.

read also : అక్కినేని-తొక్కనేని మాటలపై స్పందించిన బాలయ్య..అవి ఫ్లోలో వచ్చిన మాటలు !

Visitors Are Also Reading