Home » సుడిగాలి సుధీర్ చేసిన పనికి షాక్ అయిన నెటిజన్లు.. ఏంటంటే..?

సుడిగాలి సుధీర్ చేసిన పనికి షాక్ అయిన నెటిజన్లు.. ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

బుల్లితెర కమెడియన్ లలో సుడిగాలి సుధీర్ అంటే తెలియని వారుండరు. ఆయన తన కామెడీ, యాంకరింగ్, నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇటీవల ఈటివి కి గుడ్ బై చెప్పిన సుడిగాలి సుధీర్ శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా అభిమానులకు టచ్లోనే ఉన్నారు. కమెడియన్ నుంచి యాంకర్ గా మారినప్పటికీ సుధీర్ ని మాత్రం అభిమానించే వారి సంఖ్య ఏమాత్రం తగ్గలేదు.

Advertisement

సుడిగాలి సుధీర్ ప్రస్తుతం సూపర్ సింగర్ జూనియర్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. సుధీర్ మరియు అనసూయ కలిసి చేస్తున్న ఈ షోకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సుధీర్ మంచి సింగర్ అని నిరూపించుకున్నాడు. తాజాగా సూపర్ సింగర్ జూనియర్ ప్రోమో రిలీజ్ కాగా, ఇందులో సుధీర్,చిత్ర కలిసి పాట పాడారు. ఇందులో సుధీర్ అందం హిందోళం అనే పాటను అద్భుతంగా పాడారు.

Advertisement

సుధీర్ ఈ పాట హేమచంద్ర నేను సుధీర్ కి పెద్ద ఫ్యాన్ అని ఈ పాటతో మరింత అభిమానం పెరిగిందని అన్నారు. సుధీర్ సింగింగ్ టాలెంట్ చూసి నెటిజన్లు కూడా మెచ్చుకుంటున్నారు. ఈ ప్రోమో లో సుధీర్ మరియు అనసూయ నక్కిలేసు గొలుసు అనే పాట తో ఎంట్రీ ఇవ్వడం, వారి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అయితే లెజెండరీ సింగర్ చిత్ర తో కలిసి సుధీర్ పాట పాడడం తో సుధీర్ లో ఇంత టాలెంట్ ఉందా అని ఆయన అభిమానులు ఎంతో సంతోష పడుతున్నారు.

ALSO REA;

నూత‌న్ ప్ర‌సాద్ జీవితాన్ని అంద‌కారంలోకి నెట్టేసిన ఘ‌ట‌న‌…ఆ రోజు షూటింగ్ లో ఏం జ‌రిగిందంటే..?

కృతిశెట్టి చేసిన ప‌నికి అస‌హ్యించుకుంటున్న అభిమానులు.. అస‌లు ఏం జ‌రిగిందంటే..?

Visitors Are Also Reading