Home » మోకాళ్ళ పై తిరుపతి మెట్లు ఎక్కిన ఆ హీరోయిన్

మోకాళ్ళ పై తిరుపతి మెట్లు ఎక్కిన ఆ హీరోయిన్

by Anji
Ad

నిత్యం తిరుమల తిరుపతిలోని శ్రీవారి దర్శనానికి రోజూ లక్షలాది మంది భక్తులు వచ్చి వెళ్తుంటారు. వారిలో కొంతమంది కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటే.. మరి కొంతమంది వీఐపీ దర్శనం చేసుకుంటారు. ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఎక్కువగా వీఐపీ దర్శనం ద్వారానే ఏడుకొండల వారిని దర్శించుకుంటారు. సినీ తారలు కాలినడకన శ్రీవారిని దర్శించుకోవడం అనేది చాలా అరుదుగా చోటు చేసుకుంటుంది.

Advertisement

తాజాగా హీరోయిన్ నందిని రాయ్ ఏకంగా మోకాళ్లపై నడుచుకుంటూ శ్రీవారి కొండ ఎక్కి మొక్కులు చెల్లించింది. సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. కష్టపడి మెట్లు ఎక్కినప్పటికీ చాలా అద్భుతమైన అనుభూతి పొందానని రాసుకొచ్చింది.

Also Read :  నయనతార సరోగసి కేసులో అడ్డంగా దొరికిన డాక్టర్

నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్- 2 ద్వారా నందినికి చాలా గుర్తింపు వచ్చింది. ‘సిల్లీ ఫెలోస్’, మోసగాళ్లకు మోసగాడు లాంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత శివరంజని, పంచతంత్ర కథలు లాంటి చిన్న సినిమాలు చేసినప్పటికీ ఆమెకి పెద్దగా గుర్తింపు రాలేదు.

Also Read :  ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్లు చిరంజీవి కోసం అంతలా కొట్టుకున్నారా.. సీక్రెట్ బయటపెట్టిన చిరు..!!

Visitors Are Also Reading