Home » ఎమోష‌న‌ల్ నోట్ రాసిన కీర్తి సురేష్‌.. అందులో ఏముందంటే..?

ఎమోష‌న‌ల్ నోట్ రాసిన కీర్తి సురేష్‌.. అందులో ఏముందంటే..?

by Anji
Ad

నేను శైల‌జ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన కీర్తి సురేష్ మ‌హాన‌టిగా మ‌నంద‌రి హృద‌యాలు దోచుకున్న‌ది. క‌ళావ‌తిగా యువ హృద‌యాల‌ను క‌ల‌వ‌ర పెట్టించింది. అయినా కానీ త‌న‌కు ఎప్పుడూ త‌న న‌ట‌న సంతృప్తిని ఇవ్వ‌లేద‌ని పేర్కొంటుంది కీర్తి సురేష్‌. న‌ట‌న మీద త‌న‌కు ఉన్న ఫ్యాష‌న్ ఇంకా బాగా చేయాల‌ని ప్ర‌తి సినిమాకు ముందే అనుకుంటుంద‌ట. న‌టిగా అన్ని త‌ర‌హా పాత్ర‌లు పోషించాల‌ని.. అదేవిధంగా క‌మ‌ర్షియ‌ల్‌గా ఆ సినిమా కూడా విజ‌యం సాధించాలి. అప్పుడే ఓ న‌టికి నిజ‌మైన సంతృప్త క‌లుగుతుంద‌ని కీర్తి సురేష్ పేర్కొంటుంది.


ఇటీవ‌లే కీర్తి సురేష్ న‌టించిన సాని కాయిదం, సర్కారు వారి పాట చిత్రాలు విజ‌య‌వంత‌మైన విష‌యం తెలిసిందే. ఈ త‌రుణంలో తొలుత త‌న టీమ్‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపింది కీర్తి సురేష్‌. తాజాగా ఆమె షేర్ చేసిన నోట్‌లో ఇలా ఉన్న‌ది. ప్రియ‌మైన వారంద‌రికీ నా మాట ఇది. న‌టిగా ఉండడం అనేది హానిక‌ర ఎగుడు దిగుడు ప్ర‌యాణం అని.. మ‌నం ఎత్తు ప‌ల్లాల‌ను చూస్తాం. ఈ ప్ర‌యాణం త‌రుచూ మ‌న గ‌మ్యాన్ని నిర్ణ‌యిస్తుంది. ఇటీవ‌లి గ‌తం నాకు ప‌రీక్ష స‌మ‌యం లాంటిద‌ని. ఇది ఒక ద‌శ అని.. ప్ర‌పంచానికి నా అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ను అందించ‌డానికి నేను నిరంత‌రం కృషి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నాకు అర్థ‌మైంద‌ని ఎమోష‌న‌ల్ నోట్ రాసింది కీర్తి సురేష్‌.

Advertisement

Advertisement


ప్ర‌స్తుతం సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న అంద‌మైన ప్ర‌యాణం గురించి కూడా కీర్తి వివ‌రించింది. త‌న సినిమా సాయి కాయిదం, స‌ర్కారు వారి పాట భారీ విజ‌యాల‌ను అందుకోవ‌డంతో ఇరు చిత్ర బృందాల‌కు కీర్తి కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. త‌న ప్ర‌యాణంలో ప్ర‌తి ద‌శ‌లో కూడా త‌న‌పై న‌మ్మ‌కం ఉంచినందుకు ద‌ర్శ‌కులంద‌రికీ ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. స‌ర్కారు వారి పాటలో కీర్తి పూర్తిగా విరుద్ధ‌మైన పాత్ర‌లో క‌నిపించింది. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ తో ఎన్నారై రౌడిరాణిగా క‌నిపించింది. పాత్ర‌లు న‌టిగా త‌న‌కు మంచిపేరు తెచ్చాయి.

Also Read : 

హీరోయిన్ పూర్ణ ‘ఢీ’ షో మానేయ‌డానికి కార‌ణం ఇదేనా..?

రామ్ చరణ్ 16వ సినిమా “హాకీ” స్టోరీతో రానుందా..?

 

Visitors Are Also Reading