Home » భిక్షాటన చేసి భార్యకు మోపేడ్ బహుమానంగా ఇచ్చిన యాచకుడు.. ఎక్కడంటే..?

భిక్షాటన చేసి భార్యకు మోపేడ్ బహుమానంగా ఇచ్చిన యాచకుడు.. ఎక్కడంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

పెళ్లంటే నూరేళ్ల బంధం.. ఏ కష్టం వచ్చినా ఒకరికి ఒకరు అండగా ఉంటూ సాగే జీవన మే జీవితం. అలాంటి జీవితం లో ఎన్నో ఒడిదొడుకులు ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కలిసిమెలిసి ఒకరికి ఒకరు చిన్న చిన్న ఆనందాలు తీర్చుకుంటూ ముందుకు పోతే భార్యభర్తల జీవితానికి సార్థకత ఉంటుంది. అలాంటి అన్యోన్యమైన ఒక యాచక జంట గురించి ఈ విషయాలు తెలుసుకోండి..?

Advertisement

అతనొక యాచకుడు.. భార్య కష్టాన్ని చూడలేక ఆమె కోసం భిక్షాటన చేసి 90 వేల రూపాయలు ఆదా చేసి ఒక మోపెడు బండిని అందించాడు. మధ్యప్రదేశ్లోని చిద్వారా జిల్లా అమరవరం గ్రామం లో ఈ ఘటన చోటు చేసుకుంది. సంతోష్ సాహూ అనే యాచకుడికి రెండు కాళ్లు పనిచేయవు. తన సతీమణి మున్ని సాహుతో కలిసి ఒక చిన్న వాహనంపై వీధుల్లో తిరుగుతూ బిక్షాటన చేసేవారు. మున్ని సాహు ఒక చక్రాల సైకిల్ ను చూస్తూ ఉండగా బస్టాండ్ లు, మసీదులు, గుళ్ళ దగ్గర వీరు భిక్షాటన చేసేవారు.

Advertisement

ఈ విధంగా వారు సంవత్సరాల నుంచి నెట్టుకొస్తున్నారు. ఇలా చేస్తే వారికి రోజుకు 300 నుండి 400 రూపాయలు వచ్చేవి. మొత్తం మీద నాలుగు సంవత్సరాలలో 90 వేల రూపాయలు పోగుచేసి సంతోష్ ఒక మోపెడు వాహనాన్ని కొనుగోలు చేసి భార్య కష్టానికి స్వస్తి పలికాడు. దీంతో ఇద్దరు దంపతులు దాని పైనే భిక్షాటన చేస్తూ ఉన్నారు. కానీ ప్రస్తుత కాలంలో కొంతమంది చిన్న చిన్న విషయాలకే భార్యలపై విరుచుకుపడుతూ చిత్రహింసలు చేస్తున్న ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం. అలాంటి వారు కనీసం ఇది చూసైనా కాస్త మారాలని మహిళా లోకం కోరుకుంటోంది.

ALSO READ;

సౌందర్య చనిపోయిన తర్వాత ఆమె భర్త పరిస్థితి ఎలా ఉందో తెలుసా..!

మీ జుట్టు పెర‌గ‌డం లేదా..? అయితే ఈ చిట్కాను ఓసారి ప్ర‌య‌త్నించి చూడండి..!

 

Visitors Are Also Reading