తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఇవాళ ఉదయం విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఎంసెట్ కి సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ ని అధికారులు తాజాగా విడుదల చేశారు. మూడు ఫేజ్ ల్లో ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 21న ప్రారంభం కానున్నది. తుది విడుత సీట్ల కేటాయింపు అక్టోబర్ 17తో ముగియనున్నది. దీనికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
- ఆగస్టు 21 నుంచి 29 వరకు ఆన్లైన్ స్లాట్ బుకింగ్
- 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్
- 23 నుంచి సెప్టెంబర్ 02 వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది.
- సెప్టెంబ్ 6 తేదీన ఇంజినీరింగ్ విభాగంలో మొదటి విడత సీట్లను కేటాయిస్తారు.సెప్టెంబర్ 28 నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఉంటుంది.
- సెప్టెంబర్ 28, 29 తేదీల్లో రెండవ విడుత స్లాట్ బుకింగ్ ఉంటుంది.
- సెప్టెంబర్ 30న సెకండ్ ఫేజ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
- సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 01 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటుంది.
- అక్టోబర్ 4న సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు.
- అక్టోబర్ 11 నుండి ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభం.
- అక్టోబర్ 13న తుది విడుత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది.
- అక్టోబర్ 11 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు.
- అక్టోబర్ 17న ఫైనల్ ఫేజ్ ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
- అక్టోబర్ 20న స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి గైడ్ లైన్స్ అధికారులు విడుదల చేయనున్నారు.
- విద్యార్థులు ఎంసెట్ కౌన్సెలింగ్ కి సంబంధించి అప్డేట్స్ కోసం https://eamcet.tsche.ac.in వెబ్సైట్ సందర్శించాలని ఎంసెట్ అధికారులు సూచించారు.
Also Read :
Vidura Niti : విదురుడు చెప్పిన ఈ నియమాలు పాటిస్తే మీకు తిరుగుండదు..!
ప్రజలు థియేటర్ కు రావాలంటే అదే చేయాలంటున్న నిఖిల్…!