Home » అల్లు అర్జున్ కి టీమిండియా ఫిదా..!

అల్లు అర్జున్ కి టీమిండియా ఫిదా..!

by Bunty
Ad

అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన పుష్ప మూవీ.. కలెక్షన్స్ లో నేటికీ పట్టు కోల్పోకుండా రన్ అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 15రోజులకి గాను 140.97 కోట్ల నెట్, 251 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది పుష్ప. 146 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన పుష్ప బ్రేక్ ఈవెన్ కి మరో 5.03 కోట్ల రూపాయల దూరంలోనే ఉంది. అయితే పాన్ ఇండియా కలెక్షన్స్ లోనే కాకుండా.. విదేశాల్లోనూ పుష్ప ప్రభంజనం కొనసాగుతుంది. యూత్, ఫ్యామిలీస్, సెలబ్రేటిసే కాకుండా క్రీడాకారులు కూడా పుష్ప మూవీకి అట్రాక్ట్ అవుతున్నారు. ఆస్ట్రేలియన్ క్రికెటర్, సన్ రైజర్స్ హైదరాబద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అయితే.. పుష్ప మూవీపై రోజుకొక మీమ్ చేస్తూ ఇంటర్నేషనల్ ప్రమోషన్ ఇస్తుంటాడు.

Advertisement

Advertisement

ఇక తాజాగా టీమిండియా కూడా పుష్ప మూవీపై ప్రశంసలు కురిపించింది. సౌత్ఆఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు నిన్న రాత్రి పుష్ప మూవీని చూసారు. తొలి టెస్టులో సౌత్ఆఫ్రికాపై చారిత్రక విజయం సాధించిన టీమిండియా ప్లేయర్స్ కి కాస్త గ్యాప్ దొరకడంతో సౌత్ ఆఫ్రికాలోని ఒక థియేటర్లో పుష్ప మూవీ చూసి ఫిదా అయిపోయారు ప్లేయర్స్. ముఖ్యంగా అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ పై ఆటగాళ్లు ప్రశంసలు కురిపించినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్నీ టీమిండియా ఆటగాడు హనుమ విహారి ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు. “సినిమా చూస్తున్నంతసేపు పుష్పరాజ్‌ ట్రాన్స్‌లో ఉన్నాం. విలక్షణ నటుల్లో ఒకడైన అల్లు అర్జున్, పుష్ప బృందానికి అభినందనలు. పుష్ప 2 కోసం వేచి చూస్తున్నాం” అని విహారి ట్విట్‌ చేశాడు. కాగా జోహన్నెస్‌బర్గ్‌లో న్యూ ఈయర్‌ వేడుకలను ఘనంగా జరపుకున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను ప్రియాంక్‌ పాంచల్‌, అశ్విన్‌లు సోషల్‌ మీడియాలో పంచుకోగా వైరల్‌ అవుతున్నాయి.

 

Visitors Are Also Reading