Home » అట్లుంటది మనతోని..NTR ను కలిసిన టీమిండియా..ఫోటోలు వైరల్

అట్లుంటది మనతోని..NTR ను కలిసిన టీమిండియా..ఫోటోలు వైరల్

by Bunty
Ad

హైదరాబాద్ వేదికగా, న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగునున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఈ నెల 18న అంటే రేపు జరగనుంది. ఈ నేపథ్యంలోనే మొన్న న్యూజిలాండ్, హైదరాబాద్ రాగా, నిన్న టీమిండియా వచ్చింది. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఇది ఇలా ఉండగా, RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ ను టీమిండియా ఆటగాళ్లు కలిశారు. న్యూజిలాండ్ తో జరిగే తొలి వన్డే కోసం హైదరాబాద్ చేరుకున్న భారత ఆటగాళ్లు నగరంలో ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శుబ్ మన్ గిల్ తదితరులు జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారు. వీళ్లంతా ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ యూజర్లు తెగ షేర్ చేస్తున్నారు.

Advertisement

ఇటీవల ముగిసిన శ్రీలంక సిరీస్ లో భారత జట్టు అద్భుతంగా ఆడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కివీస్ పై కూడా అదే జోరు కొనసాగించాలని భారత్ భావిస్తోంది. అయితే చివరగా ఈ రెండు జట్లు న్యూజిలాండ్ లో వన్డే సిరీస్ ఆడాయి. ఆ సిరీస్ ను కివిస్ జట్టే నెగ్గింది. ఇప్పుడు కూడా అదే ఫలితం రిపీట్ చేయాలని న్యూజిలాండ్ భావిస్తోంది. ఈ రెండు జట్లు తొలి వన్డేలో బుధవారం తలపడతాయి. హైదరాబాదులోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

READ ALSO : దిల్ రాజు తేజస్విని రెండో పెళ్లి వెనుక ఇంత స్టోరీ నటించింది… వీరి లవ్ స్టోరీ మామూలుగా లేదు!

Visitors Are Also Reading