Home » టీడీపీ మెనిఫెస్టో.. చంద్రబాబు 6 ప్రధాన హామీలు ఇవే..!

టీడీపీ మెనిఫెస్టో.. చంద్రబాబు 6 ప్రధాన హామీలు ఇవే..!

by Anji
Published: Last Updated on
Ad

టీడీపీ నిర్వహిస్తున్న మహానాడులో పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కీలక ప్రకటనలు చేశారు. 2024లో ఏపీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే లక్ష్యంతో భవిష్యత్ కి గ్యారెంటీ పేరుతో మినీ మేనిఫెస్టో ప్రకటించారు చంద్రబాబు. వైఎస్ జగన్ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగడుతూనే అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడుతామో ప్రజల్లోకి తీసుకెళ్లారు. ముఖ్యంగా మినీ మేనిఫెస్టోలో 6 కీలక పథకాలను వెల్లడించారు. నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు టీడీపీ పెద్ద పీట వేసింది. 

చంద్రబాబు 6 ప్రధాన హామీలు ఇవే..!

Advertisement

పేదలను ధనవంతులు చేయడం :

 ఐదేళ్లలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంటి టీడీపీ. మినీ మేనిఫెస్టో లో భాగంగా చంద్రబాబు రిచ్ టూ పూర్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకంతో పేదలను సంపన్నులుగా చేసేవిధంగా టీడీపీ ప్రభుత్వం ముందడుగు వేయనుంది. ఐదేళ్లలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేసేవిధంగా టీడీపీ భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 

బీసీలకు రక్షణ :

బీసీలకు రక్షణ చట్టం తీసుకొచ్చి అన్ని విధాలుగా అండగా నిలుస్తుంది టీడీపీ. వైఎస్సార్ సీపీ హయాంలో 26 మందికి పైగా బీసీలు హత్యకు గురయ్యారు. 650 మంది నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు. రాష్ట్రలో 43 మందికి పైగా ముస్లిం మైనార్టీలపై దాడులు జరిగాయి. వీటిని  దృష్టిలో పెట్టుకొని టీడీపీ బీసీలకు రక్షణ చట్టాన్ని కల్పిస్తోంది. 

ఇంటింటికి నీరు :

Advertisement

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటింటికి మంచి నీరు పథకం కింద ప్రతీ ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తుంది టీడీపీ. అధికారంలోకి రాగానే ప్రతీ ఇంటికి కుళాయి కనెక్షన్ ఇస్తామన్నారు. చంద్రబాబు. 

Manam News

అన్నదాత :

అన్నధాత పథకం కింద ఏపీలోని ప్రతీ రైతుకు ఏడాదికి 20,000 ఆర్థిక సాయం అందిస్తుంది. రాష్ట్రంలో అన్నదాత పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందించి వారికి చేయూతగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. 

మహిళా మహా శక్తి :

మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు మహాశక్తి పేరుతో పథకాన్ని తీసుకొని తీసుకొస్తామని పేర్కొన్నారు చంద్రబాబు. మహిళా మహా శక్తి పథకం ద్వారా ప్రతీ కుటుంబంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు స్త్రీ నిధి కింద నెలకు రూ.1500 నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉండే వారందరికీ చదవులకోసం ఏడాదికి రూ.15,000 అందిస్తామని ప్రకటించారు చంద్రబాబు. దీపం కథకం కింద ప్రతీ కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్నారు. ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా బస్సుల్లో మహిళలందరికీ టికెట్టు లేని ప్రయాణం సౌకర్యం కల్పిస్తామన్నారు. 

యువగళం :

ఏపీలోని నిరుద్యోగులకు రూ.20లక్షల ఉద్యోగాలు ఇస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం 

ప్రతీ నిరుద్యోగికి యువగళం నిధి కింద నెలకు 3,000 రూపాయలను ఇస్తుంది టీడీపీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

నటి ఊహ మేనమామ కూడా స్టార్ నటుడని మీకు తెలుసా..?

 చంద్రబాబు వల్ల ఎన్టీఆర్ కు మూడుసార్లు గుండెపోటు – పోసాని సంచలనం

Visitors Are Also Reading