Home » టీడీపీ-వైసీపీ వార్ ధ్వంసమైన అన్నా క్యాంటీన్ల లోనే అన్నం వడ్డించిన చంద్రబాబు..!!

టీడీపీ-వైసీపీ వార్ ధ్వంసమైన అన్నా క్యాంటీన్ల లోనే అన్నం వడ్డించిన చంద్రబాబు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వేడి రసవత్తరంగా సాగుతోంది. అధికారంలో ఉన్న వైసిపి పార్టీ, ప్రతిపక్షమైన టీడీపీ పార్టీ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత వార్ నడుస్తోంది.. ఈ మధ్య కాలంలోనే టిడిపి అధినాయకుడు చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా ఈ లొల్లి మరింత ఎక్కువైంది..ఈ మూడు రోజుల పర్యటనలో భాగంగా మొట్ట మొదటి రోజు వైసిపి మరియు టిడిపి కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.

Advertisement

ఈ క్రమంలో వైసిపి ప్లెక్సీలు కట్టడంపై సీరియస్ అయిన చంద్రబాబు, ఈ క్రమంలోనే ఆ ఫ్లెక్సీలు తొలగించడానికి టీడీపీ శ్రేణులు ప్రయత్నం చేశాయి.దీంతో ఇరు వర్గాల మధ్య భారీ ఎత్తున గొడవ సాగింది. ఒకరిపై ఒకరు రాళ్లు కూడా రువ్వుకున్నారు. దీంతో చంద్రబాబు నాయుడు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్ లను వైసిపి శ్రేణులు ధ్వంసం చేశారు. ఈ పరిణామం జరగడంతో రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు నిరసన తెలిపారు.

Advertisement

ALSO READ; రఘురామకృష్ణంరాజు సర్వేలో టీడీపీకి తీపి కబురు.. ఏంటంటే..!!

సరిగ్గా ఈ సమయంలోనే ఈ రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని దీంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు.. అనంతరం టీడీపీ శ్రేణులు అన్న క్యాంటీన్ లను నిర్మించుకొని తయారుచేసిన వంటకాలను తీసుకొచ్చి పెట్టారు. చంద్రబాబు ఆ వంటకాలను ప్రజలకు చాలా ఉత్సాహంగా వడ్డించారు.

ALSO READ;  ఎన్టీఆర్ అమిత్ షా భేటీకి తెర వెనుక ఉన్న‌దెవ్వ‌రు..? బీజేపీ ఇచ్చిన హింట్ అదేనా..?

Visitors Are Also Reading