Home » నీ గుండెల్లోని బాధ ఎవ్వ‌రికీ అర్థం కాలేదు…తార‌క‌ర‌త్న భార్య ఎమోష‌న‌ల్ కామెంట్స్..!

నీ గుండెల్లోని బాధ ఎవ్వ‌రికీ అర్థం కాలేదు…తార‌క‌ర‌త్న భార్య ఎమోష‌న‌ల్ కామెంట్స్..!

by AJAY
Published: Last Updated on
Ad

టాలీవుడ్ హీరో నంద‌మూరి వార‌సుడు తార‌క‌ర‌త్న క‌న్నుమూసి నేటికి నెల‌రోజులు అవుతోంది. ఈనేప‌థ్యంలో భ‌ర్త‌ను త‌లుచుకుంటూ అలేఖ్య‌రెడ్డి ఎమోష‌న‌ల్ అయ్యారు. సోష‌ల్ మీడియాలో భ‌ర్త‌తో క‌లిసి దిగిన ప‌లు ఫోటోల‌ను షేర్ చేసి వాటికి ఎమెష‌న‌ల్ వ్యాఖ్య‌ల‌ను రాసుకువ‌చ్చారు. అలేఖ్య‌రెడ్డి త‌న పోస్ట్ లో…నువ్వు మమ్మల్ని వ‌దిలి నేటికి నెల అవుతోంది కానీ నీ జ్ఞాప‌కాలు మమ్మ‌ల్ని ద‌హించివేస్తున్నాయి. మ‌న స్నేహం ప్రేమ‌గా మారింది.

tarakaratna-assest

Advertisement

నేను బ‌య‌ప‌డినా నువ్వు మాత్రం మ‌నం క‌లిసి జీవిస్తామ‌ని ధైర్యంగా చెప్పావు. అప్ప‌టి నుండి ఆ క్ష‌ణం కోసం ఎంతో పోరాడావు..చివ‌ర‌కి మ‌న పెళ్లి జ‌రిగిపోయింది. అయిన‌ప్ప‌టికీ ఈ పెళ్లి ఓ గంద‌ర‌గోళం…మ‌న‌పై వివ‌క్ష అయినా నువ్వు నాతో ఉన్నందుకు సంతోషంగా ఉన్నాను. నిషిక‌మ్మ పుట్టిన త‌ర‌వాత మ‌న జీవిత‌మేమారిపోయింది కానీ క‌ష్టాలు మాత్రం అలానే ఉన్నాయి.

Advertisement

ALSO READ :కోట్ల ఆస్తిని సంపాదించిన రాజబాబు.. చివరికి అనాథగా మిగలడానికి కారణమేంటి ? 

మ‌న పై చిమ్ముతున్న విషాన్ని త‌ట్టుకునేందుకు మ‌నం గంత‌లు క‌ట్టుకుని బ్ర‌తికాం..కుటుంబానికి నువ్వు దూరం అయ్యావు కాబ‌ట్టి మ‌న‌కు పెద్ద కుటుంబం ఉండాలని కోరుకున్నావు. 2019లో క‌వ‌ల‌లు జ‌న్మించ‌డంతో ఆ క‌ల నెర‌వేరింది. నీ చివ‌రి క్ష‌ణం వ‌ర‌కూ ఎన్నో క‌ష్టాలుప‌డ్డావు.

నీగుండెల్లో ఉన్న బాధ ఎవ‌రికీ అర్థం కాలేదు..క‌నీసం దాన్ని ప‌ట్టించుకోలేదు కూడా. మ‌న‌కు స‌పోర్ట్ గా ఉన్న‌వాళ్లు కూడా మ‌నల్ని వ‌దిలేశారు. చివ‌రికి నువ్వు కూడా వదిలేశావ్. నువ్వు రియ‌ల్ హీరోవి మ‌నం మ‌ళ్లీ క‌లుస్తామ‌ని ఆశిస్తున్నాను..అంటూ అలేఖ్య‌రెడ్డి త‌న పోస్ట్ లో పేర్కొంది.

ALSO READ : TSPSC రద్దు చేసిన మొత్తం పరీక్షల లిస్టు ఇదే.. వాయిదా పడ్డ పరీక్షలేవంటే..

Visitors Are Also Reading