శేఖర్ కమ్ముల యొక్క రొమాంటిక్-డ్రామా లవ్ స్టోరీ (2021)లో ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకర్షించిననటులు నాగ చైతన్య మరియు సాయి పల్లవి మరోసారి వెండితెరపై సందడి చేయనున్నారు. అయితే.. ఈ సారి దేశ భక్తి యాక్షన్ డ్రామా మూవీలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. ప్రేమమ్ మరియు కార్తికేయ ఫ్రాంచైజీకి ప్రసిద్ధి చెందిన చందూ మొండేటి నేతృత్వంలో, తండేల్ రూపొందుతోంది. ఈ సినిమా ఒక మత్స్యకారుని చుట్టూ తిరుగుతుంది, అతను మరో 21 మందితో పాటు పాకిస్తాన్లో నిర్బంధించబడ్డాడు. శనివారం చిత్రనిర్మాతలు విడుదల చేసిన 131 సెకన్ల టీజర్, తాండల్ ప్రపంచం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. సముద్రం మధ్యలో పడవలో నాగ చైతన్యతో మునుపెన్నడూ చూడని అవతారంలో కనిపిస్తారు.
Advertisement
ఈ టీజర్ బ్యాక్గ్రౌండ్లో ఎగురుతున్న భారతీయ జెండా కనిపిస్తుంది. దీనికి చై డైలాగ్ వాయిస్ ఓవర్ గా వినిపిస్తూ ఉంటుంది. “దద్దా గుర్తెట్టుకో.. ఈపాలి యాట గురితెప్పేదేలేదేస్.. ఇక రాజులమ్మ జాతరే” అంటూ శ్రీకాకుళం యాసలో నాగచైతన్య మాట్లాడతారు. ఈ టీజర్ లో నాగ చైతన్య రఫ్ లుక్ లో కనిపిస్తున్నారు. గతంలో ఎప్పుడు మనం నాగ చైతన్యని ఈ లుక్ లో చూడలేదు. “మా నుంచి ఊడిపోయిన ఒక ముక్క మీకే అంతుంటే.. ఆ ముక్కని ముష్టి వేసిన మాకెంతుండాలి అని కౌంటర్ ఇవ్వడం బావుంది. పాకిస్తాన్ గడ్డపై చెబుతున్నా భారత్ మాతాకీ జై ” అంటూ చైతూ చెప్పే డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటాయి.
ఇంకా ఈ టీజర్ చివరిలో సాయి పల్లవి కూడా కనిపిస్తారు. సహజంగానే అందంగా ఉండే ఆమె.. ఈ టీజర్ లో మరింత అందంగా మెరిసిపోయారు. బ్యూటిఫుల్ విజువల్స్, సాయి పల్లవి, చై డిఫరెంట్ లుక్స్, అదిరిపోయే డైలాగ్స్ తో టీజర్ ఐ ఫీస్ట్ గా ఉందనే చెప్పచ్చు. అన్ని వర్గాల ప్రజలను ఈ సినిమా ఆకట్టుకుంటుందని తెలుస్తోంది.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!