Home » ముగ్గురిని మోసం చేసి మ‌రో యువ‌కుడితో పెళ్లి…చివ‌రికి ఏం చేసిందో తెలుసా…?

ముగ్గురిని మోసం చేసి మ‌రో యువ‌కుడితో పెళ్లి…చివ‌రికి ఏం చేసిందో తెలుసా…?

by AJAY
Ad

ఒక‌ప్పుడు నిత్య‌పెళ్లి కొడుకు అనే వార్త‌లు మాత్ర‌మే చూసేవాళ్లం కానీ ఇప్పుడు నిత్య పెళ్లి కూతురు అంటూ కూడా వార్త‌లు ద‌ర్శ‌నం ఇస్తున్నాయి. కొంత‌మంది మంది మ‌హిళ‌లు డ‌బ్బుల కోస‌మే పెళ్లి చేసుకుని ఆ త‌ర‌వాత అందిన కాడికీ దోచుకుంటున్నారు. ఆ త‌ర‌వాత భర్త నుండి దూరంగా వెళ్లి మ‌రో పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘ‌ట‌నే క‌ర్నాట‌క‌లో చోటు చేసుకుంది. ఆ నిత్య పెళ్లి కూతురు ఏకంగా న‌లుగురిని పెళ్లి చేసుకుంది.

Advertisement

కానీ త‌ప్పుచేసిన‌వాళ్లు చ‌ట్టం నుండి తప్పించుకోలేరు. కాబ‌ట్టి ఆమె కూడా దొరికిపోయింది. మ‌రి ఎలా దొరికిపోయింది..? ఆ పెళ్లి కూతురు ఎందుక‌లా చేసింది అనే వివ‌రాలు ఇప్పుడు చూద్దాం…త‌మిళ‌నాడులోని రంగ‌నాథ‌పురానికి చెందిన న‌ట‌రాజ‌న్ అనే యువ‌కుడికి బేక‌రిలో ప‌నిచేస్తున్న అభిన‌య అనే యువ‌తితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. తాను త‌ల్లిదండ్ర‌ల‌తో గొడ‌వ‌ప‌డి హాస్ట‌ల్ ఉంటున్నాన‌ని అభిన‌య యువ‌కుడితో చెప్పింది.

Advertisement

ఆ త‌ర‌వాత ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. అంతే కాకుండా న‌ట‌రాజ‌న్ అభిన‌య‌ను ప్రేమిస్తున్న‌ట్టు త‌న ఇంట్లో చెప్పి ఓ గుడిలో వివాహం చేసుకున్నాడు. పెళ్లి త‌ర‌వాత ఇద్ద‌రూ వేరు వేరు న‌గ‌ల దుకాణాల‌లో ఉద్యోగానికి చేరారు. అయితే మొద‌టి రోజు న‌గ‌ల దుకాణానికి వెళ్లిన అభిన‌య తిరిగి ఇంటికి రాలేదు. ఇంట్లోని 4 తులాల బంగారం, 20వేల న‌గ‌దు ను సైతం తీసుకుని ప‌రార్ అయ్యింది.

Image for representation only. Photo: Shutterstock

దాంతో న‌ట‌రాజ‌న్ వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు సెల్ ఫోన్ సిగ్న‌ల్ ఆధారంగా అభిన‌యను ప‌ట్టుకున్నారు. కాగా అప్ప‌టికే అభిన‌య‌కు పెళ్లై భ‌ర్త‌తో పాటూ బిడ్డ కూడా ఉన్న‌ట్టు విచార‌ణలో తేలింది. అంతే కాకుండా అభిన‌య మ‌రో ముగ్గురిని కూడా పెళ్లి చేసుకుని మోసం చేసిన‌ట్టు గుర్తించి అరెస్ట్ చేశారు.

ALSO READ : టాలీవుడ్ లో వ్యాపార‌వేత్త‌ల‌ను పెళ్లిచేసుకున్న 5 గురు స్టార్ హీరోయ‌న్స్ వీళ్లే..!

Visitors Are Also Reading