Home » గుర్తు పట్టలేనంతగా మారిపోయిన కొత్త బంగారు లోకం హీరోయిన్…ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా….?

గుర్తు పట్టలేనంతగా మారిపోయిన కొత్త బంగారు లోకం హీరోయిన్…ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా….?

by AJAY
Ad

కొత్త బంగారులోకం సినిమాతో టాలీవుడ్ కు పరిచమైన హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్. మొదటి సినిమా తోనే ఈ హీరోయిన్ కుర్రాళ్ళ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. కాలేజీ అమ్మాయిలా కనిపిస్తూ ప్రేక్షకుల మదిని దోచుకుంది. ఎక్కడ… అంటూ శ్వేతా చెప్పే డైలాగ్ ను ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేదు. కొత్త బంగారులోకం సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తో శ్వేతా బసు ప్రసాద్ కు టాలీవుడ్ లో వరుస ఆఫర్ లు వచ్చాయి. ఈ ముద్దుగుమ్మకు ఛాన్స్ లు బోలెడు వచ్చినా కథల ఎంపిక లో చేసిన మిస్టేక్ వల్ల స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ను మిస్ చేసుకుంది.

Advertisement

Advertisement

అంతేకాకుండా జీనియస్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి. మళ్లీ 2018లో విజేత సినిమాలో కనిపించింది. ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది. అంతేకాకుండా బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లు మరియు సీరియల్స్ లోను నటించింది. సినిమా జీవితం ఇలా ఉంటే శ్వేత బసు ప్రసాద్ పర్సనల్ లైఫ్ లో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురుకుంది. 2018లో శ్వేతా బసు ప్రసాద్ దర్శకుడు రోహిత్ మిట్టల్ ను పెళ్లి చేసుకుంది.

కానీ పెళ్ళైన కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో అదే ఏడాది విడాకులు తీసుకున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా శ్వేతా బసు ప్రసాద్ పుట్టినరోజు జరుపుకుంది. దాంతో తన పుట్టినరోజుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఒకప్పుడు ఎంతో అందంగా కనిపించిన శ్వేతా బసు ప్రసాద్ తాజా ఫోటోలో మాత్రం డిఫరెంట్ గా కనిపిస్తుంది. అంతేకాకుండా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.

Visitors Are Also Reading