Home » మహేష్ బాబు కుటుంబంలో వరుస మరణాలకు కారణం ఆ శాపమేనా..?

మహేష్ బాబు కుటుంబంలో వరుస మరణాలకు కారణం ఆ శాపమేనా..?

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ad

తెలుగు ఇండస్ట్రీలో ఘట్టమనేని ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న కృష్ణ దాదాపుగా 350 సినిమాల్లో చేసి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటి కృష్ణ మరణించడంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ అంతా ఉలిక్కిపడింది. అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అయితే కృష్ణ కుటుంబంలో వరుస మరణాలు వారి ఫ్యామిలీని క్రుంగదీస్తున్నాయి.

Advertisement

 

also read:ఏ హీరోకి కూడా సాధ్యం కాని రికార్డు సూపర్ స్టార్ పేరిట ఉన్న విషయం మీకు తెలుసా ?

అలాంటి కృష్ణ కుటుంబంలో వరుస మరణాలకు కారణం ఆ శాపమే అంటూ సోషల్ మీడియా వేదిక వార్తలు వస్తున్నాయి.. మరి ఆ శాపం ఏంటో ఇప్పుడు చూద్దాం.. గత ఏడాది కాలంలో కృష్ణ ఇంట్లో ముగ్గురు మృతి చెందడం ఘట్టమనేని కుటుంబానికి తీరని లోటు అని చెప్పవచ్చు. జనవరిలో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు మరణించడంతో కృష్ణని తీవ్రంగా కలచివేసింది. తాను బతికుండగానే రమేష్ బాబు లోకాన్ని విడిచి వెళ్లడం, కృష్ణ మనసుని ఎంతో బాధ పెట్టింది. మహేష్ బాబు కి ఎంతో సపోర్ట్ గా ఉండే రమేష్ బాబు మృతి మహేష్ బాబును కూడా తీవ్రంగా బాధపెట్టిందట.

Advertisement

ఆ బాధ నుంచి కోల్కొక ముందే మహేష్ బాబు ఇంట్లో మరో విషాదం నెలకొంది. మహేష్ తల్లి ఇందిరా దేవి సెప్టెంబర్ 28న మృతి చెందింది. దీంతో కృష్ణ మరింత తీవ్రంగా కుమిలి పోయారట. దీంతో బాధ పెట్టుకున్న కృష్ణ తీవ్రమైన అనారోగ్యానికి గురై ఆయన కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఏది ఏమైనా ఎనిమిది నెలల వ్యవధిలోనే ముగ్గురు మరణించడం మహేష్ బాబును తీవ్రంగా కలిసి వేస్తుందని తెలుస్తోంది. అయితే ఒకే ఏడాదిలో ఇంత మంది చనిపోవడం చూస్తే వారి కుటుంబాన్ని ఏదో శాపం వెంటాడుతోందని అభిమానులు భావిస్తూ ఉన్నారు.

also read:ఎన్టీఆర్ నుంచి కృష్ణ వరకు ఎవరి ప్రస్థానం ఎలా సాగిందంటే..?

Visitors Are Also Reading