Home » అర్ష్‌దీప్ కు పెరుగుతున్న మద్దతు..!

అర్ష్‌దీప్ కు పెరుగుతున్న మద్దతు..!

by Azhar
Ad

భారత యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ పై ఇప్పుడు భారీ ట్రోలింగ్ అనేది జరుగుతున్న విషయం తెలిసిందే. అందుకు కారణం నిన్న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో.. విన్నింగ్ క్యాచ్ ను అర్ష్‌దీప్ వదిలేయడం. ఆ క్యాచ్ పట్టుకొని ఉంటె.. 90 శాతం ఈ మ్యాచ్ లో ఇండియానే విజయం సాధించేది. కానీ అర్ష్‌దీప్ దానిని వదిలేయడంతో.. ఫ్యాన్ అతనిపై ఆగ్రహం అనేది వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఇక ఇండియాలో కంటే పాకిస్థాన్ నుండే అర్ష్‌దీప్ పై ఎక్కువ ట్రోలింగ్ అనేది జరుగుతుంది. అలాగే అక్కడి కొందరు అతని పేరును పడు చేయాలనీ ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలోనే ఇండియాలో అర్ష్‌దీప్ కు మద్దతు అనేది పెరుగుతుంది. ఇప్పటికే భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అలాగే మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అర్ష్‌దీప్ కు తమ మద్దతు అనేది ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ లిస్ట్ లో సునీల్ గవాస్కర్ కూడా చేరిపోయారు.

Advertisement

తాజాగా అర్ష్‌దీప్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పైన గవాస్కట్ మాట్లాడుతూ… నేను అసలు దానిని సోషల్ మీడియా అని పిలవను. అందులో సోషల్ ఎథిక్స్ అనేవి లేనే లేవు. అయిన ఎవరు ముక్కు మొఖం థెయుని వారు చేసే కామెంట్స్ ను పట్టించుకోవడం అనవసరం అని నేను అనుకుంటున్నాను. అయితే ప్రజల చేతిలో మీడియా అనేది లేకపోవడమే మంచిది అని గవాస్కర్ కామెంట్స్ చేశారు.

ఇవి కూడా చదవండి :

పాకిస్థాన్ పై హాఫ్ సెంచరీతో వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన విరాట్..!

అర్ష్‌దీప్‌ ఖలిస్తాని అంటూ పాక్ ప్రచారం..!

Visitors Are Also Reading