Home » పుష్పకు ప‌నిచేసిన లైట్ భాయ్స్, సెట్ సిబ్బంధికి ఒక్కొక్క‌రి ల‌క్ష..ప్ర‌క‌టించిన సుకుమార్..!

పుష్పకు ప‌నిచేసిన లైట్ భాయ్స్, సెట్ సిబ్బంధికి ఒక్కొక్క‌రి ల‌క్ష..ప్ర‌క‌టించిన సుకుమార్..!

by AJAY
Ad

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరెక్కిన సినిమా పుష్ప‌. థియేటర్ల‌లో విడుద‌లైన ఈ సినిమాకు క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురుస్తోంది. తెలుగుతో పాటూ హిందీ త‌మిళ భాష‌ల్లోనూ పుష్ఫ‌రాజ్ త‌గ్గేదే లే అంటున్నాడు. అయితే సినిమా మంచి విజ‌యం సాధించడంతో సినిమాకు క‌ష్ట‌ప‌డి ప‌నిచేసిన టెక్నీషియ‌న్ల‌కు సుకుమార్ బంప‌రాఫ‌ర్ ప్ర‌క‌టించారు. తాజాగా సినిమాను ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పేందుకు గానూ చిత్ర యూనిట్ థాంక్యూ మీట్ ను ఏర్పాటు చేసింది.

Advertisement

sukumar

sukumar

ఈ స‌మావేశంలో ద‌ర్శ‌కుడు సుకుమార్ హాజ‌ర‌య్యారు. ఈ సంధ‌ర్బంగా సుకుమార్ దిగువ స్థాయి టెక్నీషియ‌న్ల‌కు గుడ్ న్యూస్ వినిపించాడు. సినిమాకు ప‌నిచేసిన లైట్ బాయ్స్, సెట్ సిబ్బంది, ప్రొడ‌క్ష‌న్ సిబ్బందికి ఒక్కొక్క‌రికీ ల‌క్ష‌రూపాయ‌లు అందిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ సినిమా కోసం తాను ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ్డాన‌ని త‌న‌ను మ‌ళ్లీ నిల‌బెట్టిన సినిమా పుష్ప అని సుకుమార్ భావోద్వేగానికి లోన‌య్యారు.

Advertisement

అదే విధంగా ఈ సినిమా స‌క్సెస్ లో సంగం క‌ష్టం త‌న భార్య‌ది కూడా ఉంద‌ని సుకుమార్ అన్నారు. ఇక ఈ కార్య‌క్ర‌మంలో సుకుమార్ తో పాటూ అల్లు అర్జున్ ర‌ష్మిక కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా గ‌తంలో కూడా కొంత మంది హీరోలు సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న త‌ర‌వాత గ‌డియారాలు, మొబైల్ ఫోన్లు గిఫ్టుగా ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. కానీ ల‌క్ష‌రూపాయలు ప్ర‌క‌టించ‌డం ఇదే మొద‌టి సారి.

Visitors Are Also Reading