Home » మెగా హీరోతో పాన్ ఇండియా ప్లాన్స్ లో ఉన్న సుజిత్…?

మెగా హీరోతో పాన్ ఇండియా ప్లాన్స్ లో ఉన్న సుజిత్…?

by Azhar
Ad

టాలీవుడ్ హీరో శర్వానంద్ తో రన్ రాజా రన్ సినిమా చేసి సుప్రీ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ సుజిత్. ఆ తర్వాత ఏదో నక్క తోక తొక్కిన విధంగా నేరుగా ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు. అప్పుడే బాహుబలి 2 సినిమాతో సూపర్ సక్సెస్ అందుకొని… పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు ప్రభాస్. అలాంటి ప్రభాస్ తో సినిమా అవకాశం అందుకున్న సుజిత్… సాహో అనే సినిమాను తెరకేకించాడు. అయితే ఈ సినిమాపై మొదట భారీ అంచనాలు ఉన్న.. విడుదల తర్వాత సౌత్ లో ఆ అంచనాలు అందుకోలేకపోయింది. కానీ బాలీవుడ్ లో హిట్ అందుకుంది.

Advertisement

అయితే ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పటివరకు సుజిత్ నుండి మరో సినిమా అనేది రాలేదు. మెగాస్టార్ చిరంజీవిని లూసిఫర్ సినిమా రీమేక్ లో డైరెక్ చేసే అవకాశం వచ్చినా.. ఆది కుదరలేదు. దాంతో సుజిత్ తన తర్వాత సినిమా ఎవరితో చేయబోతున్నాడు అనేది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో సుజిత్ ఇంకా మెగా కాంపౌండ్ ను వీడలేదని… అదే కాంపౌండ్ లోని ఓ హీరోతో సినిమా చేయనున్నాడు అని చాలా ప్రచారం జరుగుతుంది. కానీ ఆ హీరో ఎవరు అనేది ఇప్పుడే బయటకు వచ్చింది.

Advertisement

సుజిత్.. ఇప్పుడు కూడా మళ్ళీ నేరుగా పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. అది మరెవరితోనో కాదు.. మెగా ఫ్యామిలీలోనే పాన్ ఇండియా హీరో అయిన రామ్ చరణ్ తో. ఈ మధ్యే సుజిత్ రామ్ చరణ్ కు ఓ లైన్ వినిపించాడని.. అది బాగా నచ్చిన చరణ్ కూడా స్కిప్ట్ రెడీ చేస్తే.. సినిమా చేద్దాం అని చెప్పినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ తన 15వ సినిమా డైరెక్టర్ శంకర్ తో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అయ్యేలోపల సుజిత్ ఆ కథ పూర్తి చేసి.. షూటింగ్ ప్రారంభించాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆలాగే ఈ సినిమాను మైత్రి మూవీస్ నిర్మితబోతున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి :

ఇంగ్లాండ్‌తో వ‌న్డే.. ఆ కీలక ఆట‌గాడు అందుకే ఆడ‌లేదా..?

డివిలియర్స్ తర్వాత ఆ స్థానం సూర్య కుమార్ కే సొంతం…!

Visitors Are Also Reading