Home » రెమ్యునరేషన్ డబల్ చేసిన సుడిగాలి సుధీర్..!

రెమ్యునరేషన్ డబల్ చేసిన సుడిగాలి సుధీర్..!

by Azhar
Ad
జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ప్రజలకు పరిచయమైనా సుడిగాలి సుధీర్ కు ఇప్పుడు విపరీతమైన క్రేజ్ ఉంది అనే విషయం తెలిసిందే. అయితే ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఓ చిన్న అకామెడియన్ గా వచ్చి.. ఆ తర్వాత యాంకర్ గా మారి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ అనేది సంపాదించుకున్నాడు. అయితే ఇదివరకు శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోకు హోస్ట్ గా వ్యవహరించిన సుధీర్.. ఇప్పుడు మరో కార్యక్రమానికి వెళ్ళిపోయాడు. అక్కడ సూపర్ సింగర్ జూనియర్స్ అనే షోకు మరో యాంకర్ అనసూయతో కలిసి యాంకరింగ్ అనేది చేస్తున్నాడు. ఇదిలా ఉంటె.. ఇప్పుడు సుధీర్ రెమ్యునరేషన్ అనేది పెద్ద చర్చగా మారింది.
మాములుగా ఈ మధ్యకాలంలో టీవీల్లో పండుగ షోలు అలాగే మిగితా షోలు అనేవి ఎక్కువగా అయ్యాయి. అలంటి దారిలోనే ఇప్పుడు ”పార్టీ చేద్దాం పుష్ప” అనే ఓ కార్యక్రమం రాబోతుంది. ఇక ఇందులో నాగబాబు వంటి పెద్ద వారితో సుడిగాలి సుధీర్ కూడా కనిపిస్తున్నాడు. అయితే ఈ షోకు ఇప్పుడు సుధీర్ భారీమొత్తంలో వసూల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే గతంలో శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసినప్పుడు సుధీర్.. ఒక్కో ఎపిసోడ్ ను 5 నుండి 7 లక్షలకు వరకు తీసుకునేవాడట..!
కానీ ఇప్పుడు ఆ షోను వదిలేసి పూర్తిగా ఇటు వచ్చి.. ఇందులో భాగమైన ఈ పార్టీ చేద్దాం పుష్ప అనే షోను హోస్ట్ చేయడానికి తన రెమ్యునరేషన్ ను పెంచేసాడట. అంటే  దీనికి ఇప్పుడు 10 నుండి 15 లక్షల వరకు సుధీర్ వసూల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అంత రెమ్యునరేషన్ ఎందుకంటే సుధీర్ క్రేజ్ అనే చెప్పాలి. ఓ హీరోకు తక్కువ కాకుండా క్రేజ్ ఉండే సుధీర్ అక్కడ శ్రీదేవి డ్రామా కంపెనీ వదిలేసిన తర్వాత ఆ షో రేటింగ్స్ పడిపోగా.. ఇప్పుడు సుధీర్ ఉన్న ఈ షో యొక్క ప్రోమోకు మాత్రం భారీ రెటైన్స్ వ్యూస్ అనేవి వస్తున్నాయి. అందుకు కారణం సుధీర్ ఒక్కడే అని అందరికి తెలుసు. అందుకే అతనికి అంత భారీ మొత్తం అనేది ఇస్తున్నారు.

Advertisement

Visitors Are Also Reading