Home » జ‌బ‌ర్ద‌స్త్‌కు షాక్ ఇస్తూ ఒక్కేసారి మానేసిన సుధీర్, ఆది..?

జ‌బ‌ర్ద‌స్త్‌కు షాక్ ఇస్తూ ఒక్కేసారి మానేసిన సుధీర్, ఆది..?

by Azhar
Ad
జబర్దస్త్ షో గురించి అందరికీ తెలిసిందే. 2013లో ప్రారంభమైన ఈ నవ్వుల కార్యక్రమం తొమ్మిదేళ్లుగా విజయవంతంగా సాగుతూ వస్తుంది. కానీ ఇప్పుడు ఈ షో ముగింపు దశకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే మొదట దీనికి మూల స్తంభమైన నాగబాబు దీని నుండి బయటికి వచ్చేశాడు. ఆయనతో పాటు కొంత మంది కమెడియన్ల కూడా వెళ్ళిపోయారు. అయినా కూడా రోజా ఒంటరిగా ఈ షోను నడిపిస్తూ వచ్చింది. కానీ ఈమధ్య రోజాకు సీఎం జగన్ క్యాబినెట్ లో మినిస్టర్ గా అవకాశం రావడంతో ఆవిడ జబర్దస్త్ కు గుడ్ బై చెప్పారు.
ఇక ఈ దెబ్బ నుండి కోలుకుంటున్న సమయంలో ఇప్పుడు జబర్దస్త్ కు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఇందులో స్టార్ కమెడియన్స్ గా గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను ముగ్గురు ఒకే సారి ఈ షోకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. అయితే హైపర్ ఆది చాలా రోజుల నుండి జబర్దస్త్ లో కనిపించకుండా ఉంటే సుదీర్ శ్రీను మాత్రం ఈ మధ్య వెళ్ళిపోయారు. అయితే జబర్దస్త్ లో వీరికే ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది అనే విషయం అందరికి తెలిసిందే. ఇక తాజాగా ప్రసారమైన జబర్దస్త్ షోలో ఆటో రాంప్రసాద్ ఒక్కడే టీమ్ లీడర్ గా దర్శనమిచ్చాడు.
అలాగే తన స్నేహితులు జీవితంలో పైకి వెళ్లడానికి షో నుండి వెళ్లిపోయారని చెప్పేసాడు. కానీ ఇదే సమయంలో ఈ ముగ్గురు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కనిపిస్తున్నారు. అయితే అవన్నీ ఇంతకుముందే షూట్ చేసిన ఎపిసోడ్స్ అని… తాజా ఎపిసోడ్స్ లో ఈ ముగ్గురు కనిపించరు అని ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే సమయంలో ఈ ముగ్గురికి మరో ఛానెల్ నుండి భారీ రెమ్యునరేషన్ తో ఆఫర్స్ వచ్చాయని తెలుస్తోంది. మరి వాటికి ముగ్గురు ఓకే చెప్పారా లేదా అనేది ముందు ముందు తెలుసుకోవాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading