రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన బ్రహ్మాస్త్ర సినిమా రీసెంట్ గా విడుదలైంది. ఈ సినిమాలో రణ్ బీర్ భార్య ఆలియా భట్ హీరోయిన్ గా నటించింది. భారీ గ్రాఫిక్స్ తో అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఈ బాలీవుడ్ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేశారు. ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. కానీ ఇప్పటికే ఈ సినిమాకు వందల కోట్ల కలెక్షన్ లు వచ్చాయి.
Advertisement
అంతే కాకుండా ఇప్పటికీ ఈ సినిమా థియేటర్ లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో టాలీవుడ్ హీరో నాగార్జున కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాను ఓ టాలీవుడ్ హీరో మిస్ చేసుకున్నాడు అన్న సంగతి చాలా మందికి తెలియదు. కాగా మొదటగా ఈ సినిమాలో నటించే ఆఫర్ హీరో సుధీర్ బాబుకు సైతం వచ్చిందట.
Advertisement
సుధీర్ బాబు ఇప్పటికే బాలీవుడ్ లో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక తనకు బ్రహ్మాస్త్రలో నటించే అవకాశం వచ్చిందని సుధీర్ బాబు రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపారు. బ్రహ్మాస్త్ర లో నటించే అవకాశం మొదట తనకే వచ్చిందని చెప్పాడు. అయితే అప్పుడు తాను సమ్మోహనం సినిమా షూటింగ్ తో పాటూ పుల్లెల గోపిచంద్ సినిమాలో నటిస్తున్నానని చెప్పాడు.
అందువల్లనే బ్రహ్మాస్త్ర సినిమాను రిజెక్ట్ చేశానని చెప్పాడు. ఇక సుధీర్ బాబు బ్రహ్మాస్త్ర సినిమాను మిస్ చేసుకున్నప్పటికీ సమ్మోహనం సినిమాతో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అలా సుధీర్ బాబు బాలీవుడ్ సినిమాను మిస్ చేసుకున్నప్పటికీ మరో హిట్ తో ముందుకు వచ్చారు. ఇక ప్రస్తుతం సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో నటించాడు. ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.