Home » లోకల్ ట్రైన్ లో ప్రయాణించి సింప్లిసిటీ చూపించిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా ?

లోకల్ ట్రైన్ లో ప్రయాణించి సింప్లిసిటీ చూపించిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా ?

by Anji
Ad

సాధారణంగా సినీ తారలు లగ్జరీ కార్లలో ప్రయాణించడానికి ఇష్టపడుతుంటారు. బస్సులు, రైళ్లు, ఆటోలు వంటి ప్రజా రవాణా సౌకర్యాలను అసలు వినియోగించరు. అలా వినియోగించడం చాలా అరుదు అనే చెప్పాలి. సెల్రబిటీలు పబ్లిక్ ట్రాన్స్ ఫోర్టులో ప్రయాణం చేస్తే భద్రత పరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. అభిమానుల తాకిడిని తట్టుకోలేరు. 

Advertisement

సెల్పీలు, ఫొటోలు అంటూ జనాలు ఎగబడుతుంటారు.  దీని ఫలితంగా వారితో పాటు పక్కనున్న వారికి కూడా తీవ్ర అసౌకర్యం కలుగుతుంటుంది. కొందరూ స్టార్ హీరోలు, హీరోయిన్లు అప్పుడప్పుడు ప్రజా రవాణాలలో జర్నీ చేసి ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా బాలీవుడ్ కి చెందిన ఓ స్టార్ హీరోయిన్ కూడా అలాగే చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖానికి మాస్క్ పెట్టుకొని ముంబై లోకల్ ట్రైన్ లో ప్రయాణించింది. మాస్క్ పెట్టుకోవడం చాలా మంది గుర్తు పట్టలేదు. కానీ కొందరూ గుర్తు పట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హీరోయిన్ ఎవరో మీరు గుర్తు పట్టారా ? 

Also Read :  Yashoda: సమంత యశోద మూవీకి ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయో మీకు తెలుసా..?

ఈమె మరెవ్వరో కాదండోయ్.. బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్. ట్రాఫిక్ సమస్యలను అధిగమించడంతో పాటు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో తన టీమ్ తో కలిసి ఇలా లోకల్ ట్రైన్ లో ప్రయాణం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సారానే ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. స్టార్ సెలబ్రిటీ స్టేటస్ ఉన్నా ఇలా లోకల్ ట్రైన్ లో జర్నీ చేయడం సారా సింప్లిసిటీకి నిదర్శనమని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సైఫ్ వారసురాలిగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సారా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. కేదర్ నాథ్, సింబా, లవ్ ఆజ్ కల్, కూలీ నెంబర్ వన్, అత్రంగీ రే సినిమాలలో నటించి ఇప్పటికే క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం గ్యాస్ లైట్ తో పాటు మరొకొన్ని చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 

Also Read :  సావిత్రి కెరీర్ నే మార్చేసిన ఈ సాంగ్ గురించి మీకు తెలుసా ?  

Visitors Are Also Reading