అందాల తార శృతిహాసన్ ప్రస్తుతం సీనియర్ హీరోలకు జోడీ కడుతోంది. తాజాగా బాలకృష్ణ, చిరంజీవి హీరోలుగా నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలలో శృతిహాసన్ నటించింది. అంతే కాకుండా ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్ర సలార్ లో కూడా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాన్ ఇండియాకు పరిచయం అవుతోంది. ఇక ప్రస్తుతం తెలుగుతో పాటూ తమిళ్ లోనూ శృతి సినిమాలు చేస్తోంది.
Advertisement
ఈ ముద్దుగుమ్మ కమల్ హాసన్ నటవారసురాలిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కాగా వరుస సినిమాలతో తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంటోంది. ఇక సంక్రాంతికి విడుదలవుతున్న రెండు సినిమాల కోసం శృతిహాసన్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్ లు చేసింది. అంతే కాకుండా శృతిహాసన్ తన మానసిక సమస్య గురించి ఇంటర్వ్యూలో మాట్లాడింది.
Advertisement
శృతి మాట్లాడుతూ…నేను బాధపడుతున్నటువంటి మానసిక సమస్య ఉన్నట్టుండి ఎక్కువగా ఆవేశపడటమే. అంతే కాకుండా చాలా తొందరగా సహనాన్ని కోల్పోతున్నాను. మొదట్లో నేను నా సమస్య గురించి చెప్పడానికి భయపడేదాన్ని. అయితే ఆ సమస్యను దాచుకోవడం వల్ల మరింత పెరిగే అవకాశం ఉంది అందువల్ల భయటకు చెబుతున్నాను. అంతే కాకుండా ఈ సమస్య అధికమైనప్పుడు దాని నుండి బయటపడడానికి సంగీతం వింటుంటాను.