విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ఆగస్టు 25న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పై ముందు నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో తెరెక్కిన ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ భారీగా వర్కౌట్ లు చేసి చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాలో మైక్ టైసన్ కూడా నటించారు. విజయ్ కు జోడీగా హీరోయిన్ గా అనన్యపాండే నటించగా సినిమాలో రమ్యకృష్ణ హీరోకు తల్లి పాత్రలో నటించింది.
Advertisement
ఇక భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అసలు సినిమాలో కథ లేదంటూ మార్నింగ్ షో నుండే నెగిటివ్ టాక్ మొదలయ్యింది. అంతే కాకుండా సినిమా లో చాలా లాజిక్ లు మిస్ అయ్యారని పాటలు సంధర్బం లేకుండా వస్తాయంటూ రివ్యూలు ఇచ్చారు. ఇక ఈ సినిమా పై తాజాగా వివాదాస్పద నటి శ్రీరెడ్డి రివ్యూ ఇచ్చింది.
Advertisement
లైగర్ సినిమాలో కంటెంట్ లేదు కానీ మహేశ్ బాబు డేట్స్ కావాలా అంటూ కామెంట్ చేసింది. తీసేవన్నీ అట్టర్ ఫ్లాప్ సినిమాలే మళ్లీ మహేశ్ బాబు డేట్స్ ఇవ్వలేదని చెప్పడం ఏంటో అంటూ వ్యాఖ్యానించింది. డేట్స్ ఇవ్వలేదని ఏడవటం ఎంతవరకూ కరెక్ట్ అంటూ కామెంట్ చేసింది.
సినిమాలో కంటెంట్ లేదు ఆ సినిమాకు హైప్ అవసరమా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంకా లైగర్ ముందు లైగర్ తరవాత అంట ఇలాంటివన్నీ మనకు అవసరమా అంటూ కామెంట్స్ చేసింది. లైగర్ సినిమా కంటే కార్తికేయ సినిమా చాలా బాగుందంటూ పేర్కొంది. ఇక ప్రస్తుతం శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.