Home » బాలయ్య నాగ్ ల మధ్య గొడవలు ఆనాటివా… పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లిన ఆ గొడవ ఏంటంటే..?

బాలయ్య నాగ్ ల మధ్య గొడవలు ఆనాటివా… పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లిన ఆ గొడవ ఏంటంటే..?

by AJAY
Ad

ప్రస్తుతం సోషల్ మీడియాలో బాలకృష్ణ నాగార్జున అభిమానుల మధ్య వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య రీసెంట్ గా వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో అక్కినేని తొక్కినేని అంటూ మాట్లాడటం వివాదానికి కారణమయ్యింది. బాలయ్య స్వారీ చెప్పాలని నాగార్జున అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇక బాలయ్య కావాలని అలా చెప్పలేదని ఫ్లో లో వచ్చిందని బాలయ్య అభిమానులు అంటున్నారు.

Advertisement

అయితే నిజానికి బాలకృష్ణ నాగ్ ల మధ్య పాత గొడవలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. వీరి గొడవలకు అసలు కారణం వేరే ఉందంటూ టాక్ వినిపిస్తోంది. 2012 సంవత్సరంలో బాలకృష్ణ హీరోగా నటించిన శ్రీమన్నారాయణ సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమానే ఇద్దరి మధ్య దూరానికి కారణమైనట్టు టాక్ వినిపిస్తోంది.

Advertisement

ఈ సినిమా 2012 ఆగస్టు 30వ తేదీన విడుదలై యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా విడుదలైన వారం రోజుల తర్వాత నాగార్జున నటించిన షిరిడి సాయి సినిమా విడుదల అయింది. కాగా కూకట్ పల్లి లోని ఓ థియేటర్ లో బాలయ్య సినిమాను తీసేసి షిరిడి సాయి సినిమాను ప్రదర్శించారట. దాంతో బాలయ్య …నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల పై ఫైర్ అయ్యారట. ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ నాగ్ ల మధ్య దూరం పెరిగినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా అక్కినేని నాగేశ్వరరావు ఒకప్పటి స్టార్ హీరో అయినప్పటికీ ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ ఆయన మరణించిన తర్వాత బాలకృష్ణ అంత్యక్రియలకు హాజరవ్వలేదు. ఆ ఘటన కూడా బాలయ్య నాగ్ ల మధ్య దూరం పెరగడానికి మరో కారణమైనట్టు తెలుస్తోంది. అయితే అటు నాగార్జున ఇటు బాలకృష్ణ ఇద్దరూ ఇంటర్వ్యూలలో తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పిన సంగతి తెలిసిందే.

Also read :Pawan Kalyan : గుడిలో ఉంటే “వారాహి”.. రోడ్డు మీద ఉంటే “పంది” పవన్ పై మళ్లీ రెచ్చిపోయిన వర్మ!

Visitors Are Also Reading