Home » మెల్ల క‌న్ను ఉంద‌ని క‌ళ్లు చితంబరం ప‌క్క‌న న‌టించ‌ని చెప్పిన స్టార్ హీరోయిన్…ఆమె ఎవ‌రంటే..?

మెల్ల క‌న్ను ఉంద‌ని క‌ళ్లు చితంబరం ప‌క్క‌న న‌టించ‌ని చెప్పిన స్టార్ హీరోయిన్…ఆమె ఎవ‌రంటే..?

by AJAY
Ad

ఒకప్పుడు క‌మెడియ‌న్ గా న‌టుడుగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న క‌ళ్ల చిదంబ‌రం చాలా మందిని త‌న న‌ట‌న‌తో మెప్పించారు. వంద‌ల చిత్రాల‌లో న‌టించిన క‌ళ్లు చిదంబ‌రం అమ్మోరు సినిమాతో అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఈ సినిమాలో త‌న న‌ట‌న‌తో ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. చూడ్డానికి బక్క‌ప‌ల‌చ‌ని దేహంతో క‌నిపిస్తూ క‌మెడియ‌న్ గా న‌వ్వులు పూయించారు.

Advertisement

ఆయ‌న యాస మాట తీరు కూడా ప్ర‌త్యేకంగా ఉండ‌టంతో అవ‌కాశాలు వెతుక్కుంటూ వ‌చ్చేవి. ఇక వైజాగ్ పోర్టులో ఉద్యోగం చేస్తున్న కళ్లు చిదంబ‌రం నాటకాలు కూడా వేశారు. అలా ఓ ద‌ర్శ‌కుడి కంట ప‌డ‌టంతో అవ‌కాశం అందుకున్నారు. మొద‌ట క‌ళ్లు చిదంబ‌రం గొల్ల‌పూడి మారుతీరావు రాసిన క‌ళ్లు అనే పుస్త‌కం ఆధారంగా తెర‌కెక్కిన క‌ళ్లు అనే చిత్రంలో న‌టించారు.

Advertisement

ఆ సినిమాలో న‌టించ‌డం తో ఆయ‌న ఇంటిపేరే క‌ళ్లుగా మారిపోయింది. ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున శ్రీదేవి హీరోహీరోయిన్ లుగా గోవిందా గోవిందా అనే సినిమాను తెర‌కెక్కించారు. అయితే ఈ సినిమాలో ఓ పాత్ర కోసం రామ్ గోపాల్ వ‌ర్మ క‌ళ్లు చిదంబ‌రం ను తీసుకున్నారు. కాగా ఆ స‌న్నివేశంలో శ్రీదేవి క‌ళ్లు చిదంబ‌రం క‌లిసి న‌టించాల్సి ఉంది.

కానీ శ్రీదేవి క‌ళ్లు చిదంబరం ప‌క్కన న‌టించ‌డానికి ఒప్పుకోలేద‌ట‌. దాంతో రామ్ గోపాల్ వ‌ర్మ క‌ళ్లు చిదంబ‌ర్ ఓ గొప్ప వ్య‌క్తి ఆయ‌న ఇంజ‌నీర్ గా ప‌నిచేశారు. అని శ్రీదేవికి వివరించార‌ట‌. దాంతో శ్రీదేవి ఒప్పుకుని ఆ త‌ర‌వాత క‌ళ్లు చిదంబ‌రం ప‌క్క‌న న‌టించింది. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుగ‌క‌గా విడుద‌ల కాగా డిజాస్ట‌ర్ టాక్ ను సొంతం చేసుకుంది.

ALSO READ : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు శుభవార్త.. కార్తీకదీపం 2 సీరియల్ త్వరలోనే..!

Visitors Are Also Reading