అందాలతార శ్రీదేవి అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. శ్రీదేవి టాలీవుడ్ నుండి సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చినా ఆ తరవాత బాలీవుడ్ ను సైతం షేక్ చేసింది. తెలుగులో ఒకప్పటి స్టార్స్ అందరి సరసన జోడీ కట్టింది. ఎన్టీఆర్ లాంటి సీనియర్ హీరో పక్కన నటించడమే కాకుండా ఆ తరవాత తరంలోని మెగాస్టార్,నాగార్జున లాంటి హీరోల పక్కన సైతం శ్రీదేవి నటించి అలరించింది.
Advertisement
అయితే నందమూరి అభిమానులకు మాత్రం ఓ లోటు ఉండిపోయింది. అప్పట్లో బాలయ్య కూడా స్టార్ హీరోగా రానించిన సంగతి తెలిసిందే. దాంతో బాలయ్య శ్రీదేవి కాంబోలో ఓ సినిమా రావాలని అభిమానులను ప్రేక్షకులు కోరుకునేవారు. కానీ వీరి కాంబినేషన్ లో సినిమా రాలేదు.
ALSO READ : దోమలకు అలాంటి వారి రక్తం అంటే చాలా ఇష్టమట.. సైంటిస్టులు ఏమంటున్నారంటే..?
Advertisement
అయితే వీరద్దరి కాంబినేషన్ లో నిర్మాత అశ్వినిదత్ ఓ సినిమాను నిర్మించాలని అనుకున్నారు. చిరంజీవి జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా తరవాత బాలయ్య నటించిన అశ్వమేధం సినిమాలో బాలయ్యకు జోడీగా శ్రీదేవిని అనుకున్నారు. ఈ సినిమాను అశ్వినిదత్ ఈ సినిమా కోసం శ్రీదేవిని సంప్రదించారు కూడా. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో శ్రీదేవి నో చెప్పారు.
ఇక ఈ సినిమాలో మరో హీరోగా శోభన్ బాబు నటించగా హీరోయిన్ లుగా నగ్మా మరియు మీనాలు నటించారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాల మధ్యన తెరకెక్కించారు. అయితే అదే ఏడాది ప్రభుత్వం సినిమాలకు రాయితీలు ప్రకటించాడంతో చాలా సినిమాలు విడుదలయ్యాయి. దాంతో అశ్వమేధం సినిమాకు హిట్ టాక్ వచ్చినా నష్టాలు మాత్రం తప్పలేదు.
ALSO READ : రాజమౌళి తన సినిమాల్లో ప్రకాశ్ రాజ్ ని తీసుకోకపోవడానికి కారణం అదేనా ?