Home » శ్రీ‌దేవి త‌ల్లి రాజేశ్వ‌రి సినిమాల్లో న‌టించిన విష‌యం మీకు తెలుసా..?

శ్రీ‌దేవి త‌ల్లి రాజేశ్వ‌రి సినిమాల్లో న‌టించిన విష‌యం మీకు తెలుసా..?

by Anji

శ్రీ‌దేవి ఓ గొప్ప న‌టి. అంత‌కు మించిన అంద‌గ‌త్తె. దివి నుంచి భువికి దిగి వ‌చ్చిన అతిలోక సుంద‌రి. త‌న సొగ‌సుతో చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ఢ‌మాల్ అంటూ ప్రేమ‌లో ప‌డేసిన ఓ గొప్ప సొగ‌స‌రి. కేవ‌లం హీరోల‌కు మాత్ర‌మే ఎక్కువ క్రేజ్ అనుకుంటున్న ఆ రోజుల్లో హీరోల‌ను త‌ల‌ద‌న్నే క్రేజ్ సంపాదించుకున్న వైనం కేవ‌లం శ్రీ‌దేవికి మాత్ర‌మే సొంతం.

శ్రీ‌దేవి గురించి చెప్పుకుంటూ పోతే ఎన్ని పేజీలు రాసినా త‌రగ‌ని చ‌రిత్ర ఆమెది. నాడు ఎన్టీఆర్ నుంచి మొన్న‌టి చిరంజీవి వ‌ర‌కు అంద‌రి స‌ర‌స‌న న‌టించింది శ్రీ‌దేవి. నేటి త‌రం ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితురాలుగా మారిపోయింది. అని చెప్ప‌డంతో అతిశ‌యోక్తి లేదు. చైల్డ్ ఆర్టీస్ట్‌గా కెరీర్ మొద‌లు పెట్టిన శ్రీ‌దేవి ఆ త‌రువాత హీరోయిన్‌గా అవ‌తార‌మెత్తింది. ఇక హీరోయిన్ గా వ‌చ్చిన త‌రువాత ఎక్క‌డా వెన‌క్కి తిరిగి చూసుకోలేదని చెప్పాలి. ఇలా శ్రీ‌దేవి గురించి అంద‌రికీ తెలుసు. కానీ శ్రీ‌దేవి త‌ల్లి కూడా సినిమాల్లో న‌టించింద‌ని ఇక ఎంతో మంది స్టార్‌ హీరోల సినిమాల్లో అవ‌కాశాలు ద‌క్కించుకుని అన్న‌ది మాత్రం చాలా త‌క్కువ మందికి తెలుసు. ఆ వివ‌రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీ‌దేవి త‌ల్లి పేరు రాజేశ్వ‌రి. ఆమె కూడా ఎన్నో సినిమాల్లో న‌టించి న‌టిగా గుర్తింపు సంపాదించుకోవాల‌ని ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది. మ‌హాన‌టి సావిత్రి హీరోయిన్‌గా న‌టించిన చివ‌ర‌కు మిగిలేది అనే సినిమాలో 1960లో అందానికి అందం అనే పాట‌లో కుఊడా క‌నిపిస్తుంది రాజేశ్వ‌రి. ఏఎన్నార్ రాజ‌సులోచ‌న 1960లో న‌టించిన శాంతి నివాసం సినిమాలో కృష్ణ‌కుమారికి సోద‌రి పాత్ర‌లో న‌టించింది రాజేశ్వ‌రి. ఇక ఆ త‌రువాత ఏఎన్నార్ కృష్ణ‌కుమారి క‌లిసి న‌టించిన భార్య భ‌ర్త‌లు సినిమాలో ఇక అక్కినేని నాగేశ్వ‌ర‌రావును ప్రేమించిన అమ్మాయిగా న‌టించింది. ఇలా ఎన్నో సినిమాల్లో సైడ్ క్యారెక్ట‌ర్లు చేసింది శ్రీ‌దేవి త‌ల్లి రాజేశ్వ‌రి.

Also Read :  అల‌ వైకుంఠ‌పుర‌ములో సినిమా న‌టుడి భార్య కూడా మ‌న‌కు తెలిసిన స్టార్ హీరోయిన్…ఎవ‌రంటే..!

Visitors Are Also Reading