Home » శ్రీదేవి చనిపోయే 4 నెలల ముందు బోనీకపూర్ తో మాటల్లేవ్..ఆ 200 కోట్ల కోసమేనా..?

శ్రీదేవి చనిపోయే 4 నెలల ముందు బోనీకపూర్ తో మాటల్లేవ్..ఆ 200 కోట్ల కోసమేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

అలనాటి నటి శ్రీదేవి అంటే దేశవ్యాప్తంగా ఎంతో పేరుగాంచిన హీరోయిన్. తెలుగు ఇండస్ట్రీలో కూడా ఆమె అనేక సినిమాలు తీసి అతిలోక సుందరిగా మారింది. సినిమాల్లో శ్రీదేవి హీరోయిన్ గా ఉంటుంది అంటే తప్పనిసరిగా సినిమా హిట్ అయ్యేది. అలాంటి శ్రీదేవి జీవితం చివరి రోజుల్లో మాత్రం చాలా దారుణంగా గడిచాయి. ఎవరు ఊహించని విధంగా పరమపదించారు.. ఇంతటి అందాల భామ ఆ విధంగా మరణిస్తుందని ఎవరు ఊహించలేదు.. మరి శ్రీదేవి మరణం వెనుక ఉన్న అసలు విషయాలు ఏంటో చూద్దాం.. శ్రీదేవి తన జీవితంలో ఎన్నో సినిమాలు తీసి కోట్లాది రూపాయలు సంపాదించింది. అనేక ప్రాపర్టీస్ కూడా పెట్టింది. అలాంటి శ్రీదేవి అనుమానస్పదంగా మృతి చెందింది. ఆమె మృతి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..

Advertisement

 

also read:ఒకప్పటి అందాల తార నగ్మ ఇప్పుడు ఎలా ఉందో…? ఏం చేస్తుందో తెలుసా….?

Advertisement

శ్రీదేవి మరణం ఒక సస్పెన్స్ త్రిల్లెర్స్ సినిమాను తలపించింది. ముందుగా గుండెపోటుతో చనిపోయిందని.. తర్వాత ఆమె జరిగిన సర్జరీలు ఎఫెక్ట్ తో చనిపోయిందని, ఆ తర్వాత ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయిందని గంటకో మాట చెప్పి మరణంపై అనుమానాలు వచ్చే విధంగా చేశారు. బాతులో పడిపోయి చనిపోయింది అని చెప్పడం అనుమానానికి దారితీస్తోంది. ఆమె గత 25 సంవత్సరాల నుండి కూడా బాత్ టబ్ లోనే స్నానం చేసేవారట. అలాంటిది ఆ హోటల్లో ఆరడుగు లోతు కూడా లేని దాంట్లో పడి ఏ విధంగా చనిపోతుంది అనే దానిపై విచారణ జరిపించాలని అప్పట్లో చాలామంది నుంచి అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఇందులో ముఖ్యంగా తన భర్త బోనికపూర్ పై అప్పట్లో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు.

ఆయన శ్రీదేవి చనిపోవడానికి నాలుగు నెలల ముందు నుంచే ఆమెతో మాట్లాడటం లేదట.. వారి కుటుంబంలో గొడవలు సాగుతున్నాయట. ఈ తరుణంలోనే ఆమె చనిపోవడం అనేక అనుమానాలకు దారితీసింది. సోషల్ మీడియా వేదికగా అనేకమంది శ్రీదేవి మరణంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.. ఇదే విషయంపై సీనియర్ జర్నలిస్టు ఈ మంది రామారావు ఒక విషయాన్ని బయటపెట్టారు. ఆమె ఎలా మరణించింది అనేది ఎవరికి తెలియదు కానీ, ఆమె పేరిట 200 కోట్ల ఇన్సూరెన్స్ ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆ ఇన్సూరెన్స్ కోసం మరణించిందా లేదా మరణించేలా చేశారా అనేది మిస్టరీగా మారిందని అన్నారు. ఇందులో ఎంత వరకు నిజం ఉందో, అబద్ధం ఉందో తెలియదు కానీ అందాల అతిలోకసుందరి అందరికీ దూరమైంది.

also read:చలికాలంలో ఈ డ్రింక్ తాగండి.. అసిడిటితో పాటు బరువు కూడా తగ్గొచ్చు..!

Visitors Are Also Reading