ఎన్టీరామారావు నుండి చిరంజీవి వరకూ స్టార్ హీరోల సరసన సినిమాలు చేసిన హీరోయిన్ శ్రీదేవి. అప్పట్లోనే శ్రీదేవి హీరోల కంటే ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంది. తన డేట్స్ కోసం స్టార్ హీరోలు ఎదురు చూసే స్థాయికి ఎదిగింది. తెలుగుతో నటప్రస్థానం మొదలు పెట్టినప్పటికీ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. శ్రీదేవి డైరెక్ట్ గా హీరోయిన్ గా కాకుండా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలు పెట్టింది.
Advertisement
ఎన్టీరామారావు సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆ తరవాత ఆయన పక్కనే హీరోయిన్ గా కూడా నటించి ఆకట్టుకుంది. అప్పటి హీరోలలో ఎన్టీఆర్,కృష్ణ, ఎన్నార్ లతో నటించగా ఆ తరవాత తరంలో చిరంజీవి, వెంకటేష్ లాంటి హీరోలతో జతకట్టి ప్రశంసలు అందుకుంది. ఇక 1996లో శ్రీదేవి బాలీవుడ్ నిర్మాత బోణీకపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
పెళ్లి తరవాత మెల్లి మెల్లిగా శ్రీదేవి సినమాలకు దరం కావడం మొదలయ్యింది. అడపా దడపా సినిమాలు చేస్తూ కుటుంబ బాధ్యతలను చూసుకోవడం మొదలు పెట్టింది. ఇదిలా ఉంటే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో శివగామి పాత్ర కోసం ముందుగా శ్రీదేవినే సంప్రదించామని అన్నారు.
Advertisement
కానీ శ్రీదేవి చేసిన డిమాండ్ల వల్లే ఆమె స్థానంలో రమ్యకృష్ణను తీసుకున్నట్టు తెలిపారు. శ్రీదేవి శివగామి పాత్ర చేసేందుకు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ కోరిందట. అంతే కాకుండా తనతో పాటూ వచ్చే సిబ్బందికి కూడా స్టార్ హోటల్స్ లో బస కల్పించాలని చెప్పిందట. అక్కడితో ఆగకుండా తాను షూటింగ్ కు వచ్చేందుకు బిజినెస్ క్లాస్ టికెట్లను ఏర్పాటు చేయాలని తెలిపారట. అయితే ముందే జక్కన్న తన సినిమాలకు బడ్జెట్ తక్కువ చేసి నిర్మాతలపై భారం పడకూడదు అని భావిస్తారు.
కాబట్టి ఆ స్థానంలో రమ్యకృష్ణను తీసుకున్నారు. ఇక బాహుబలిలో శివగామిగా రమ్య కృష్ణ ఏ రేంజ్ లో నటించిందో తెలిసిందే. కానీ రాజమౌళి చేసిన వ్యాఖ్యలలో నిజం లేదని శ్రీదేవి కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం ఆశ్చర్యకరం. తన భర్త కూడా ఓ నిర్మాత అని తనకు నిర్మాతల కష్టాలు తెలుసని వ్యాక్యానించింది. ఏది ఏమైనా ఇప్పుడు శ్రీదేవి మనమధ్యన లేకపోవడం బాధాకరం.