Home » ఉత్త‌ చేతులతో వ‌చ్చి ఇండ‌స్ట్రీలో కోట్లు సంపాదించా..శ్రీవిష్ణు ఎమోష‌న‌ల్..!

ఉత్త‌ చేతులతో వ‌చ్చి ఇండ‌స్ట్రీలో కోట్లు సంపాదించా..శ్రీవిష్ణు ఎమోష‌న‌ల్..!

by AJAY
Ad

టాలీవుడ్ లో వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ న‌ట‌న‌తో ఆక‌ట్టుకునే అతికొద్ది మంది హీరోల‌లో శ్రీవిష్ణు కూడా ఒక‌రు. శ్రీవిష్ణు హీరోగా న‌టించిన నీది నాది ఒకే క‌థ‌, మెంట‌ల్ మ‌దిలో, బ్రోచేవారెవ‌రు లాంటి సినిమాలు సూప‌ర్ హిట్ గా నిలిచాయి. ఇక తాజాగా మ‌రో వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రం అర్జున ఫాల్గుణ తో శ్రీవిష్ణు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. ఈ సినిమా డిసెంబ‌ర్ 31 విడుద‌ల కానుంది. ఈ సినిమా ట్రైల‌ర్ ఇప్ప‌టికే విడుద‌ల చేయ‌గా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇక ఈ సినిమాకు తేజ మ‌ర్ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

sri vishnu

sri vishnu

అంతే కాకుండా మ్యాట్ని ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమాలో అమృత అయ్య‌ర్ శ్రీవిష్ణుకు హీరోయిన్ గా న‌టించింది. గోదావ‌రి బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఇదిలా ఉండ‌గా ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్ ను తాజాగా హైద‌రాబాద్ లో నిర్వ‌హించారు. కాగా ఈ ఈవెంట్ లో శ్రీవిష్ణు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శ్రీవిష్ణు మాట్లాడుతూ….ద‌ర్శ‌కుడు తేజ చాలా టాలెంటెడ్ అని చెప్పారు.

Advertisement

Advertisement

తాను ఇండ‌స్ట్రీకి వ‌చ్చేట‌ప్పుడు ఉత్త చేతులతో వ‌చ్చన‌ని కానీ ఇప్పుడు కోట్లు సంపాదించాన‌ని అన్నారు. ఆ కోట్లు తాను సినిమాలు చేసిన ద‌ర్శ‌కులే అని శ్రీవిష్ణు ఎమోష‌న‌ల్ అయ్యారు. ఈ సినిమా పూర్తి షూటింగ్ గోదావ‌రి జిల్లాల్లోనే జ‌రిగింద‌ని ఈ సినిమా త‌ర‌వాత గోదావ‌రి జిల్లాల వారు కాల‌ర్ ఎగ‌రేసుకుని తిరుగుతారంటూ వ్యాఖ్యానించారు. కేవ‌లం 55 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింద‌ని శ్రీవిష్ణు వెల్ల‌డించారు. నిర్మాత‌లు చాలా ఫ్రీడ‌మ్ ఇచ్చార‌ని వారివ‌ల్లే అవుట్ పుట్ భాగా వ‌చ్చింద‌ని శ్రీవిష్ణు తెలిపారు.

Visitors Are Also Reading