Home » భర్త మీ మాట వినాలంటే ఈ 2 సూత్రాలు పాటించండి.. అది చాలా ఇంపార్టెంట్..!!

భర్త మీ మాట వినాలంటే ఈ 2 సూత్రాలు పాటించండి.. అది చాలా ఇంపార్టెంట్..!!

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on

చాలామంది దంపతుల మధ్య సరైన బాండింగ్ కుదరక అనేక గొడవలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా భర్త భార్య మాట వినకుండా, నువ్వేంటి నాకు చెప్పేది అనే అహంతో ఉండడం.. దీనివల్ల కుటుంబంలో కలతలు ఏర్పడుతూ ఉంటాయి.. మరి దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

#1.శివ ఆరాధన :

also read:ఆ ఇద్దరి వల్లే జబర్దస్త్ కు దూరమైన అనసూయ…వెలుగులోకి సంచలన నిజాలు…?

దంపతుల మధ్య సఖ్యత కుదరాలి అంటే అర్ధనారీశ్వర రూపంలో ఉన్న ఆరాధన చేయాలి. ఎలా అంటే ఎడమ భాగంలో పార్వతీదేవి, కుడిభాగంలో పరమేశ్వరుడు ఉన్న చిత్రపటాన్ని ఇంట్లో ఉంచుకోవాలి. ప్రతి సోమవారం రోజున గంధపుష్పార్చనతో అర్చన చేసి, అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణ చేయడం, అట్లతో తయారుచేసిన పాయసాన్ని పరమేశ్వరునికి ప్రసాదంగా పెట్టాలి. ఈ విధంగా పాటిస్తే దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి సుఖ జీవనం గడుపుతారని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు..

#2. మహావిష్ణువు ఆరాధన :

ముఖ్యంగా దంపతుల మధ్య సమస్య ఏర్పడినప్పుడు శ్రీమహావిష్ణువుని కేశవ స్వామి స్వరూపంగా ఆరాధన చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయట. శ్రీ మహావిష్ణువుని తులసితో అర్చన చేసి, బూంది నివేదనగా సమర్పించాలి. ముఖ్యంగా కేశవ స్వామికి ఇష్టమైన వస్తువు కస్తూరి. ఈ పరిమళ ద్రవ్యాన్ని తీసుకొని పూజ చేయడం వల్ల కూడా దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి సుఖ సంతోషాలతో ఉంటారని ఆధ్యాత్మిక నిపుణులు తెలియజేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ ఆరాధన చేసి మీ సుఖవంతమైన జీవితానికి బంగారు బాటలు వేసుకోండి..

also read:

Visitors Are Also Reading