Home » Sr. NTR-వెంకటేష్ చేయాలనుకున్న మల్టీస్టారర్ ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?

Sr. NTR-వెంకటేష్ చేయాలనుకున్న మల్టీస్టారర్ ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసినా మల్టీ స్టారర్ సినిమాలు పెరిగిపోయాయి. అలాంటి చిత్రాలు తీసిన వారిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ హీరో ఎవరు అంటే అందరికీ గుర్తుకు వచ్చేది హీరో వెంకటేష్ మాత్రమే. తాజాగా ఆయన తన అన్న కొడుకు రానా తో కూడా రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చేశారు. కానీ ఈ వెబ్ సిరీస్ ద్వారా వెంకటేష్ కొన్ని విమర్శల పాలయ్యారు అని తెలుస్తోంది. అంతే కాదు వెంకటేష్ ఇండస్ట్రీలో చాలామంది యంగ్ హీరోలతో మల్టీస్టారర్ మూవీ లు చేసి సక్సెస్ అందుకున్నారు..

also read:కృష్ణ కాల‌ర్ ప‌ట్టుకున్న నాగార్జున‌…భ‌గ్గుమ‌న్న కృష్ణ ఫ్యాన్స్ చివ‌రికి ఏం చేశారంటే..?

Advertisement

అలాంటి ఈ హీరో అన్న ఎన్టీఆర్ తో కూడా సినిమా చేయాలనుకున్నారట. అది కూడా గౌతమీపుత్ర శాతకర్ణి స్టోరీ తో సినిమా చేద్దామనుకొని రెడీ అయ్యారట. ఈ చిత్రంలో ఎన్టీఆర్ శాతకర్ణి పాత్ర , వెంకటేష్ ది శాతకర్ణి కొడుకు పూలమావి పాత్ర అని ఫిక్స్ అయ్యారు. అలా కథ కూడా పూర్తి చేయించారు ఎన్టీఆర్ గారు. ముఖ్యంగా ఈ స్టోరీలో గౌతమీపుత్ర శాతకర్ణి స్టోరీ తో పాటుగా పూలమావి స్టోరీ కూడా యాడ్ చేసి సినిమాను చేద్దామనుకున్నారట. ఈ చిత్రాని కి ముందు శ్రీనాథ కవి సార్వభౌముడు జరిగింది. అయితే ఈ కథ విని వెంకటేష్ కూడా ఎన్టీఆర్ తో సినిమా కాదనలేదు. కానీ తీరా కథ సిద్ధమైన తర్వాత ఎన్టీఆర్ రాజకీయాల వైపు ఎక్కువగా టైం వెచ్చించడంతో అది ఆగిపోయింది.

Advertisement

also read:స‌మంత పోస్ట్ కు స్పందించిన కోహ్లీ భార్య‌…ఇంట్రెస్టింగ్ రిప్లై ఇవ్వ‌డంతో వైర‌ల్..!

ఆ తర్వాత ఇదే కథను దర్శకుడు క్రిష్ గౌతమీపుత్ర శాతకర్ణి టైటిల్ తోనే బాలకృష్ణతో చేసి సక్సెస్ అందుకున్నాడు. అయితే ఈ మూవీ బాలయ్యకు 100వ సినిమా కావడం మరో విశేషం. ఈ విధంగా sr.ఎన్టీఆర్,వెంకటేష్ చేయాలనుకున్న గౌతమీపుత్ర శాతకర్ణి స్టోరీ చివరికి బాలయ్య దగ్గరికి వెళ్లడం జరిగింది. అయితే వెంకటేష్ కు సీనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని కోరిక తీరలేదు. దీంతో కలిసుందాం రా మూవీలో నచ్చావే పాలపిట్ట సాంగ్లో ఎన్టీఆర్ యానిమేషన్ పాత్రలో కలిసి నటించి తన కోరికను తీర్చుకున్నారు.

also read:RRR Oscar award 2023: ఆస్కార్ అందుకున్న RRR.. రికార్డు క్రియేట్ చేసిన “నాటు నాటు”..!!

Visitors Are Also Reading