సోను సూద్ అనే పేరు తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే మన దేశాన్ని కరోనా వణికించిన సమయంలో ఎన్ని మంచి కార్యక్రమాలను చేసాడు. ప్రజలను తమ సొంత ఊర్లను తరలించడం దగ్గర నుండి వేరే దేశం నుండి మన ఇండియన్స్ ను తీసుకురావడం వరకు చాలా పనులు చేసాడు. అలాగే కష్టాల్లో ఉన్నవారిని ఆదుకున్నాడు కూడా. దాంతో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా సోను సూద్ పేరు మరు ప్రోగి పోయింది. అలాగే ఆయనకు ఎందరో అభిమానులు కూడా వచ్చారు. ఇక సినిమాల్లో ఎక్కువగా విలన్ గా కనిపించిన సోను సూద్ రియల్ లైఫ్ లో హీరో అయ్యాడు.
Advertisement
ఇక మన తెలుగు అభిమానులకు సూపర్ సినిమాతో పరిచయమయ్యాడు. అందులో అనుష్క అన్నగా నటించాడు. ఆ తర్వాత చాలా సినిమలో కనిపించిన సోనుకు అరుంధతి సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది. అప్పటి నుండి సౌత్ లో వెనుదిరిగి చూడలేదు. అయితే ఇప్పుడు తాజాగా సౌత్ ఇండస్ట్రీ గురించి సోను సూద్ షాకింగ్ కామెంట్స్ చేసాడు. అయితే మొదట బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సోను మంచి పాజిటివ్ పాత్రలే చేయాలి అనుకున్నాడట. కానీ తనకు ఎటువంటి బ్యాగ్రౌండ్ లేదు.
Advertisement
దాంతో అన్ని నెగెటివ్ పాత్రలే వచ్చినట్లు చెప్పాడు. అదే సమయంలో సౌత్ నుండి మంచి పాత్రలు వచ్చాయని అన్నారు. ఒక రకంగా తనను బాలీవుడ్ లో చెత్త పాత్రలు చేయకుండా సౌత్ ఇండస్ట్రీ కాపాడింది అని చెప్పుకొచ్చాడు. అందులో మధ్యలో కొంతకాలం అసలు హిందీ సినిమాలు చేయకుండా కేవలం సౌత్ సినిమాలు మాత్రమే చేశాను అని సోను సూద్ చెప్పాడు. అయితే తాజాగా సోను సూద్ చిరంజీవి ఆచార్య సినిమాలో విలన్ గా కనిపించి మెప్పించాడు. కానీ ఆ సినిమా మాత్రం పెద్దగా ఆడలేదు అనే విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి :