బాలీవుడ్ నటుడు సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా సోనూసూద్ కరోనా సమయంలో పేదల పాలిట ఓ దేవుడిలాగా ఆపదలో ఉన్న ఎంతో మందికి ఆర్థిక సహాయం చేశాడు. ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో అయితే వలస కార్మికులు, కూలీలకు సాయం అందించిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా సీరయస్ గా ఉన్న పేషెంట్లకు వైద్య సదుపాయాలు అందించి పలువురి ప్రాణాలుగా ప్రాణాలను కాపాడారు. ఇక అప్పటి నుంచి ఆయన తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఎక్కడ ఎవ్వరూ ఏ ఆపదలో ఉన్నా సరే ఆయనకు చెబితే తప్పకుండా తనవంతుగా సాయం చేస్తూనే ఉంటాడు సోనూసూద్. ఇప్పటికీ కూడా సోషల్ మీడియా వేదికగా ఎంతో మందికి సాయం అందిస్తున్నారు.
Advertisement
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినా లేదా సర్జరీలు వంటి వాటి కోసం ఆర్థిక సాయం కావాలంటూ సోనూ సూద్కు ట్వీట్ చేస్తుంటారు. ఇలాంటివి తన దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి వారికి సాయం అందిస్తున్నారు సోనూసూద్. సామాజిక సేవతో ఎంతో మందిని ఆదుకుంటున్న ఆయన తాజాగా మరొక సారి గొప్ప మనస్సు చాటుకున్నారు. తాజాగా 7 నెలల ఓ చిన్నారికి లివర్ ట్రాన్స్ ప్లాంటేసన్ కి సాయం చేశారు.
Advertisement
కరీంనగర్ కి చెందిన మహ్మద్ సఫర్ అలీ అనే 7 నెలల బాబు బైలియరీ అట్రిసియా అనే వ్యాధి భారిన పడ్డాడు. దీంతో ఆ పసిబాలుడి కాలేయం పూర్తిగా దెబ్బతిన్నది. ఇక ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ బాబు కి వైద్యం అందించడం కోసం అతని తల్లిదండ్రులు సోనూసూద్ ని సాయం కోరారు. దీంతో ఆయన ముందుకొచ్చి తన ఛారిటీ ఫౌండేషన్ ద్వారా కేరళలోని కొచ్చి నగరంలో చికిత్స అందించారు. ఎస్తేర్ మెడిసిటీ ఆసుపత్రిలో లివర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో ప్రస్తుతం ఆ పసిబాలుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఆర్థికసాయం అడగ్గానే మమ్ముల్ని దేవుడిలా ఆదుకున్నారని పేర్కొంటూ.. సోనుసూద్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు సఫర్ అలీ తల్లిదండ్రులు.
Also Read :
ప్రపంచంలో తొలుత విమానాన్ని కనుగొన్నది భారతీయుడే అనే విషయం మీకు తెలుసా..?
కష్టాల్లో ఉన్న మోహన్ బాబు కు రజినీకాంత్ చేసిన సాయం అదేనా..? నిజంగా రజినికి హ్యాట్ సాఫ్…!