Home » ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీతారామం బ్యూటీ.. ఎందుకో తెలుసా ?

ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీతారామం బ్యూటీ.. ఎందుకో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఫస్ట్ సినిమాతో బ్లాక్ బస్టర్ మిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది.  ఈ సినిమా తరువాత తన తరువాత ప్రాజెక్ట్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది. వాస్తవానికి మృణాల్ సౌత్ ఇండస్ట్రీలోనే బిజీ కాబోతుందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు మృణాల్ మరో ప్రాజెక్ట్ అనౌన్స్ రాలేదు. ఎందుకంటే.. తన తరువాత సినిమా కోసం రెమ్యునరేషన్ భారీగానే డిమాండ్ చేస్తుందట. తాజాగా ఈ ముద్దుగుమ్మను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేసింది. అసలు ఇంతకు ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

Advertisement

సీతారామం సినిమాతో మృణాల్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ సినిమా తరువాత వరుస ఆపర్లను సొంతం చేసుకుంది. తాజాగా ఈ బ్యూటీ ట్రోల్స్ బారిన పడింది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ మొదలయ్యాయి. అందుకు కారణం ఆమె సెలెక్ట్ చేసుకున్న సినిమానే అని చెప్పవచ్చు. ఇటీవల బాలీవుడ్ లో పిప్పా అనే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మృణాల్. ఇక ఈ సినిమాలో హీరో సిస్టర్ రోల్ లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం. ఈ సినిమాలో పాత్ర నచ్చడంతో మృణాల్ ఓకే చెప్పేసిందట. అయితే హీరోయిన్ గా రాణిస్తున్న సమయంోలనే ఇలా సిస్టర్స్ రోల్ చేయడమేంటని ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. 

Manam News

ఇలా అయితే కెరీర్ ఖతమవుతుందనే కామెంట్లు కూడా చేస్తున్నారు. దీనిపై మృణాల్ స్పందిస్తూ.. “ హీరోయిన్లు.. హీరోయిన్లుగానే నటించాలా ? సిస్టర్ భార్య, అమ్మ లాంటి క్యారెక్టర్స్ చేయకూడదా? అని ప్రశ్నించింది. ఇలాంటి పద్దతిని మనం బ్రేక్ చేసినప్పుడే మనలో ఉన్న టాలెంట్ ఏందో తెలుస్తుంది. కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఓ గొప్ప పాత్ర మిస్ చేసుకున్నాననే బాధ ఉండొద్దు. అందుకే ఈ పాత్ర నచ్చడంతో సోదరి రోల్ అయినప్పటికీ ఓకే చేశాను” అని చెప్పుకొచ్చింది మృణాల్.

Also Read :  యాక్టర్ రంగనాథ్ లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులు ఉన్నాయా..?

Visitors Are Also Reading