Home » గుండె బ‌రువెక్కింది…గుబులు మొద‌ల‌య్యింది అంటూ సింగ‌ర్ సునిత ఎమోష‌న‌ల్ పోస్ట్..!

గుండె బ‌రువెక్కింది…గుబులు మొద‌ల‌య్యింది అంటూ సింగ‌ర్ సునిత ఎమోష‌న‌ల్ పోస్ట్..!

by AJAY
Ad

టాలీవుడ్ లోని టాప్ సింగ‌ర్ ల‌లో సునిత కూడా ఒక‌రు. సింగ‌ర్ సునిత టాలీవుడ్ లో వంద‌ల పాట‌ల‌ను త‌న గొంతుతో అద్భుతంగా పాడి అభిమానులను సంపాదించుకున్నారు. ప్లేబ్యాక్ సింగ‌ర్ గా మరియు డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ గా సునిత ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్నారు. కేవ‌లం పాటలు పాడ‌ట‌మే కాకుండా సింగింగ్ షోల కు జ‌డ్జిగా వ్యవ‌హ‌రిస్తూ బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు ఆమె ఎంతో ద‌గ్గ‌ర‌య్యారు. ఇక సునిత పాట‌ల‌కే కాకుండా ఆమె అందానికి అభిన‌యానికి సైతం ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

Advertisement

దాంతో సునిత‌కు సోష‌ల్ మీడియాలో ల‌క్ష‌ల్లో అభిమానులు ఉన్నారు. ఆమె పెట్టే ప్ర‌తి పోస్ట్ కు లైకులు కామెంట్ లు సైతం భారీగా వ‌స్తుంటాయి. ఇక సునిత రీసెంట్ గా రెండో వివాహం చేసుకుని వార్త‌ల్లో హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా పెళ్లి త‌ర‌వాత రెట్టింపు ఉత్సాహంతో టీవీ షోల‌లో క‌నిపిస్తున్నారు.

ALSO READ : ఉగాది పచ్చడీ తీసుకోకపోతే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మిస్ అయినట్టే..!

Advertisement

ఇదిలా ఉంటే సునిత తాజాగా సోష‌ల్ మీడియాలో ఎమోష‌న‌ల్ పోస్ట్ చేశారు. కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రంగ‌మార్తండ సినిమా చూసి సునిత ఎమోష‌న‌ల్ అయ్యారు. ర‌మ్య‌కృష్ణ మ‌రియు ప్ర‌కాష్ రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన సినిమా రంగ‌మార్తాండ‌. ఈ సినిమాకు కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా సినిమాలో రాహుల్ సిప్లింగ‌జ్, అన‌సూయ‌, ఆద‌ర్శ్, బ్ర‌హ్మానందం, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ లు ముఖ్య పాత్ర‌లు పోశించారు.

ఇక ఈ సినిమా చూసిన అనంత‌రం సునిత సోష‌ల్ మీడియాలో….ఇప్పుడే రంగ‌మార్తాండ చూశా…ఈ విష‌యాన్ని మీతో పంచుకోకుండా ఉండ‌లేక‌పోతున్నా..సినిమాలోని పాత్ర‌ల‌ను కృష్ణ‌వంశీ అద్భుతంగా తీర్చిదిద్దారు. సినిమా చూశాక గుండె బ‌రువెక్కింది, గుబులు మొద‌ల‌య్యింది..అయితే ఆ బ‌రువు ఎంతో బాగుంది అంటూ పేర్కొన్నారు.

ALSO READ : ఎన్టీఆర్, చరణ్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన కాలబైరవ.. ఎందుకంటే ? 

Visitors Are Also Reading