Home » చిన్మయి సరోగసి ద్వారా పిల్లలను కనిందా…? ఇంతకీ ఏం జరిగిందో తెలుసా….!

చిన్మయి సరోగసి ద్వారా పిల్లలను కనిందా…? ఇంతకీ ఏం జరిగిందో తెలుసా….!

by AJAY
Ad

టాలీవుడ్ సింగర్ చిన్మయి శ్రీపాద పరిచయం అక్కర్లేని పేరు. సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చిన్మయి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే సింగర్ గా కంటే చిన్మయి వివాదాల తోనే ఎక్కువ పాపులర్ అయ్యారు. ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పిన చిన్మయి అప్పట్లో తరచూ వార్తల్లో నిలిచారు. ఇప్పటికీ లైంగిక వేధింపుల పై గళం విప్పుతూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.

Advertisement

ఇదిలా ఉంటే చిన్మయి హీరో రాహుల్ ను వివాహం చేసుకున్న సంగతి తెల్సిందే. హీరోగా పరిచయం అయిన రాహుల్ చిలసౌ సినిమా తో దర్శకుడిగా కూడా మెప్పించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇక తాజాగా చిన్మయి కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయాన్ని రాహుల్ చిన్మయి లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ వార్త విన్న నెటిజన్లు షాక్ అయ్యారు. చిన్మయి గర్భవతి అన్న విషయం తెలియనెలేదు సరోగసి ద్వారా బిడ్డలకు జన్మనిచ్చారా..? అంటూ లేని పోని అనుమానాలు వ్యక్తం చేశారు.

Advertisement

దాంతో చిన్మయి స్పందిస్తూ ఓ పోస్ట్ పెట్టింది. తాను సిజెరియన్ ద్వారా కవలలకు జన్మనిచ్చా ను అని చెప్పింది. గర్భవతి గా ఉన్నప్పటి నుండి తన ఫోటోలు బయటకు రాకుండా చూసుకున్నట్టు తెలిపింది. తన వ్యక్తిగత విషయాలను ఎప్పుడూ బయట పెట్టలేదు అని….పిల్లల ఫోటోలు కూడా కొంత కాలం వరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేయను అని చెప్పింది. అంతే కాకుండా సిజేరియన్ చేస్తున్న సమయం లో భజన పాటలు పాడాను అంటూ ఆసక్తికర విషయం చెప్పింది.

Visitors Are Also Reading