Home » శిఖర్ ధావన్ కు రానున్న పూర్తి కెప్టెన్సీ..!

శిఖర్ ధావన్ కు రానున్న పూర్తి కెప్టెన్సీ..!

by Azhar
Ad
సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఈ ఏడాది భారత జట్టుకు కెప్టెన్సీ వహించిన కెప్టెన్ లలో ఒక్కడిగా ఉన్నాడు. గత ఏడాదే శ్రీలంకకు వెళ్ళిన భారత బి జట్టుకు కెప్టెన్ గా వ్యవరించిన ధావన్.. తర్వాత జట్టు నుండి చోటు కోల్పోయాడు. కానీ మళ్ళీ అనూహ్యంగా తాజాగా టీం ఇండియా వెళ్ళిన వెస్టిండీస్ పర్యటనలో వన్డే సిరీస్ కు ధావన్ ను కెప్టెన్ గా నియమించింది బీసీసీఐ.
ఆ తర్వాత జింబాంబ్వే పర్యటనకు కూడా మొదట ధావన్ ను కెప్టెన్ ను చేసి.. మళ్ళీ రాహుల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అతడికి కెప్టెన్సీ ఇచ్చింది. కానీ తాజాగా వస్తున్న వార్తల ప్రకారం శిఖర్ ధావన్ కు పూర్తి స్థాయి కెప్టెన్సీ అనేది రానున్నట్లు తెలుస్తుంది. కానీ అది ఇండియా జట్టుకు కాదు. ఐపీఎల్ లో పంజాబ్ కింగే జట్టుకు. ఈ ఏడాది జరిగిన మెగవేలంలో ఢిల్లీ వదిలేసిన ధావన్ ను పంజాబ్ తీసుకున్న విషయం తెలిసిందే.
ఇక లంక పర్యటనలో ధావన్ కెప్టెన్ గా ఉండటం వల్ల.. ఈ ఐపీఎల్ 2022 లో అతనికే కెప్టెన్సీ ఇస్తారు అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే పంజాబ్ కెప్టెన్ రాహుల్ ఆ జట్టును వదిలివెళ్ళిపోయాడు. కానీ పంజాబ్ జట్టు మాత్రం మయాంక్ అగర్వాల్ ను కెప్టెన్ గా చేసింది. కానీ మయాంక్ సక్సెస్ కాలేదు. అందుకే ఇప్పటికే 15 సీజన్స్ లో 14 మంది కెప్టెన్ లను మార్చిన పంజాబ్ జట్టు వచ్చే ఐపీఎల్ లో ధావన్ కు కెప్టెన్సీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.

Advertisement

Visitors Are Also Reading