Home » జైపూర్ లో శర్వానంద్ వివాహం కోసం రోజుకు ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

జైపూర్ లో శర్వానంద్ వివాహం కోసం రోజుకు ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

టాలీవుడ్ యంగ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. ఈయన త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం విధితమే. ఈ ఏడాది ప్రారంభంలోనే యూఎస్ లో సాఫ్ట్ వేర్ గా ఇంజనీర్ గా పనిచేస్తున్న రక్షితారెడ్డి తో శర్వానంద్ నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, సినీ సెలెబ్రెటీల సమక్షంలో వీళ్ళిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. హైదరాబాద్లో జరిగిన ఈ వేడుకకు రామ్ చరణ్, ఉపాసన, సిద్ధార్థ్, అదితి రావు హైదరీ వంటి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Advertisement

ఇటీవలే వీరి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు. రాజస్థాన్ లోని జైపూర్ లో ఉన్న లీలా ప్యాలెస్ వీరి వివాహానికి వేదిక కానుంది. జూన్ 2, 3 తేదీల్లో గ్రాండ్ గా వివాహ వేడుకలను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. శర్వానంద్, రక్షితారెడ్డిల వివాహం జూన్ 3న జరగనుండగా.. జూన్ 2న ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి. అయితే జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో వివాహ వేడుకలు నిర్వహించాలంటే పెద్ద మొత్తంలోనే ఖర్చు అవుతుంది. ఈ ప్యాలెస్ లో రోజుకు రూ. 4 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందట. వీరి పెళ్లికి కేవలం సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరు కానున్నారు.

Advertisement

శర్వానంద్ చివరిగా ఒకే ఒక జీవితంలో సినిమాలో నటించారు. అంతకు ముందు వచ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు, ఒకే ఒక జీవితం సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం ఆయన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉండటం వల్లే శర్వానంద్ పెళ్లి ఆలస్యమైనట్లుగా తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే శర్వానంద్ కు కాబోయే భార్య రక్షితారెడ్డి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ విషయానికి వస్తే.. హైదరాబాద్ కు చెందిన హైకోర్ట్ న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షితా. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ దేవర స్టోరీ లీక్..?

WTC ఫైనల్‌ కి ముందు భారత జట్టుకు భారీ షాక్‌.. గాయపడిన ఆ స్టార్‌ ఆల్‌రౌండర్‌..!

Visitors Are Also Reading