Telugu News » Blog » సిరాజ్ కు నిరాశే.. వెళ్ళేది ఆ ఇద్దరు..!

సిరాజ్ కు నిరాశే.. వెళ్ళేది ఆ ఇద్దరు..!

by Manohar Reddy Mano
Ads

ఆస్ట్రేలియా వేదికగా ఈ నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ కోసం ఇప్పటికే భారత జట్టు అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటికి కూడా ఆ జట్టులో ఉండే ఆటగాళ్ల గురించి పూర్తి క్లారిటీ అనేది ఫ్యాన్స్ కు రాలేదు. మొదట ఈ జట్టులో ఆడాల్సిన బుమ్రా గాయపడ్డాడు. ఆ తర్వాత ఆ స్థానంలోకి రావాల్సిన షమీకి కరోనా సోకింది.

Advertisement

ఇక బుమ్రా స్థానానికి దీపక్ చాహర్, సిరాజ్ ల మధ్య పోటీ అనేది ఉంది. అయితే చాహర్ అప్పటికే స్టాండ్ బై ఆటగాడిగా ఉండటం వల్ల అతనే జట్టులోకి వెళ్తాడు అని అందరూ అనుకున్నారు. ఇక ఈ క్రమంలోనే చాహర్ గాయపడ్డాడు. అందువల్ల సిరాజ్ కు పోటీ లేదు అనుకున్నారు. కానీ అప్పటికే కరోనా నుండి షమీ కోలుకొని ఫిట్ కావడంతో అతనే ఆసీస్ వెళ్తాడు అని బీసీసీఐ సెలక్టర్లు ఫిక్స్ అయ్యారు.

Advertisement

అయితే బుమ్రా స్థానంలో షమీ వెళ్లిన.. కనీసం చాహర్ స్థానంలో స్టాండ్ బై ఆటగాడిగా అయిన సిరాజ్ ఆసీస్ వెళ్తాడు అని అనుకున్నారు. కానీ తాజాగా బీసీసీఐ సెలక్టర్లు ఆ విషయంలో కూడా సిరాజ్ ను నిరాశే మిగిల్చారు. సౌథ ఆఫ్రికాతో వన్డే సిరీస్ లో సిరాజ్ రాణించినా.. అతడిని కాదని చాహర్ స్థానంలో స్టాండ్ బై ఆటగాడిగా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ను ఎంపిక చేసినట్లు సమాచారం.

Advertisement

ఇవి కూడా చదవండి :

రోహిత్ అలా పరుగులు చేస్తే వేస్ట్..!

బీసీసీఐని ఇవ్వం అన్నారు.. ఐపీఎల్ వద్దన్నాడు..!

You may also like