Home » ఇద్దరూ మళ్లీ కలుస్తారు…. దీప్తితో బ్రేకప్ పై స్పందించిన షణ్ముక్ తండ్రి…!

ఇద్దరూ మళ్లీ కలుస్తారు…. దీప్తితో బ్రేకప్ పై స్పందించిన షణ్ముక్ తండ్రి…!

by AJAY
Ad

దీప్తి సునైనా షణ్ముఖ్ బ్రేకప్ చెప్పుకుని రోజులు గడిచిపోతున్నాయి. కానీ ఇప్పటికీ ఈ విషయం ఇంకా హాట్ టాపిక్ గానే ఉంది. ఇద్దరూ మళ్లీ కలవాలని అటు షణ్ముక్ అభిమానులు ఇటు దీప్తి అభిమానులు కోరుకుంటున్నారు. కానీ దీప్తి సునైనా మాత్రం కలవడానికి ససేమిరా అన్నట్టుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ముందుగా దీప్తి షణ్ముక్ బ్రేకప్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. బిగ్ బాస్ నుండి వచ్చిన వెంటనే షణ్ముక్ నెంబర్ బ్లాక్ చేసినట్టు కూడా తెలుస్తోంది.

Advertisement

అంతేకాకుండా షణ్ముక్ దీప్తి తో మాట్లాడతాను అని ఓ ఇటర్వ్యూలో చెప్పగా అతడిని కలిసేందుకు కూడా దీప్తి అంగీకరించ లేదు. అయినప్పటికీ దీప్తి పుట్టినరోజున శుభాకాంక్షలు చెబుతూ షణ్ముక్ ఓ పోస్టు పెట్టాడు. కానీ దీప్తి దానికి రిప్లై కూడా ఇవ్వలేదు. ఇదిలా ఉంటే తాజాగా వాళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తారు అని షణ్ముక్ తండ్రి అభిమానుల్లో కొత్త ఆశలు రేపారు. షణ్ముక్ తల్లిదండ్రులు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Advertisement

ఈ సందర్భంగా షణ్ముక్ తండ్రి మాట్లాడుతూ ….వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు. బ్రేకప్ చెప్పింది దీప్తి ….షణ్ముఖ్ ఎక్కడా చెప్పలేదని అన్నారు. వాళ్ళిద్దరి వ్యక్తిగత విషయాల గురించి మనం ఎక్కువగా తీసుకోకూడదు కాకపోతే ఆ అమ్మాయికి ఏమనిపించిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని అన్నారు. అంతేకాకుండా వాళ్లు కలవడానికి కొంత సమయం పడుతుంది ఏమో కానీ కలిసి ఉంటారని అన్నారు.

ఇది రెండు కుటుంబాలకు సంబంధించిన విషయమని అంతా శుభమే జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అభిమానులు అనుమానించాల్సిన అవసరం లేదని ధీమా వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉంటే ఇద్దరం చర్చించుకున్న తర్వాతనే విడిపోతున్నాం అని దీప్తి పేర్కొన్న సంగతి తెలిసిందే. మరి షణ్ముక్ తండ్రి చెప్పినట్టు ఈ జంట త్వరలోనే కలుస్తారా లేదా అని మళ్లీ సోషల్ మీడియాలో చర్చ షురూ అయ్యింది.

Visitors Are Also Reading