Home » సీన్ రివర్స్.. ఫ్యాన్స్ ను ట్రోల్ చేసిన షాహిన్..!

సీన్ రివర్స్.. ఫ్యాన్స్ ను ట్రోల్ చేసిన షాహిన్..!

by Azhar

గత ఏడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్ లో సెమీస్ కు చేరుకున్న పాకిస్థాన్ జట్టు.. ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న పొట్టి ప్రపంచ కప్ లో కూడా టైటిల్ ఫెవరెట్. కానీ ఆయా జట్టు సూపర్ 12 లో మొదట ఇండియా చేతిలో పాకిస్థాన్ ఉత్కంఠ మ్యాచ్ లో ఓడిపోయింది. దాంతో పాకిస్థాన్ బౌలింగ్ పై విమర్శలు అనేవి వచ్చాయి.

ఇక ఆ తర్వాత జింబాబ్వే వంటి జట్టు చేతిలో 131 పరుగులు కొట్టలేక ఓడిపోయింది పాక్. అంతే ఇక పాక్ జట్టును సొంత అభిమానులే దారుణంగా ట్రోల్ అనేది చేసారు. ప్రతి ఆటగాడిని విమర్శించారు. కానీ ఈ పరాజయం తర్వాత వరుసగా మూడు విజయాలు అందుకున్న పాకిస్థాన్.. అదృష్టం కొద్ది సెమీస్ కు చేరుకుంది. దాంతో మళ్ళీ పాక్ ఫ్యాన్స్ జట్టును సపోర్ట్ చేస్తూ.. ప్రశంసలు కురిపిస్తున్నారు.

కానీ తాజాగా పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహిన్ షా ఆఫ్రిది ఆ ఫ్యాన్స్ ట్రోల్ చేసాడు. ఈరోజు సెమీస్ చేరుకున్న తర్వాత షాహిన్ మాట్లాడుతూ.. ఫ్యాన్స్ జట్టును ఎప్పుడు ఎక్కువ సపోర్ట్ చేయాలి అంటే.. ఆ జట్టు ఓడిపోయిన సమయంలో.. అంతే కానీ జట్టు సెమీస్ కు వెళ్ళింది.. ఫైనల్స్ కు వెళ్ళింది అని సపోర్ట్ చేయడం కాదు అని కామెంట్స్ చేసాడు. అంతే ప్రస్తుతం షాహిన్ కామెంట్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి :

రాహుల్ వల్ల ఇండియా పేరిట చెత్త రికార్డులు..!

ఆస్ట్రేలియాలో ఇండియా జట్టుకు భద్రత లేదా..?

Visitors Are Also Reading