Home » ఎందుకు ఢీ మానేశాడో చెప్పిన శేఖర్ మాస్టర్..!

ఎందుకు ఢీ మానేశాడో చెప్పిన శేఖర్ మాస్టర్..!

by Azhar
Ad

బుల్లితెరపైన గాని యూట్యూబ్ లోగాని బాగా పాపులర్ అయిన షోలలో ఢీ ఉంటుంది. అయితే ఈ ఢీ అనే డ్యాన్స్ కార్యక్రమం ఎప్పటినుండో నడుస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ఎక్కువ శాతం కొరియోగ్రాఫర్లు ఈ షో నుండి వచ్చినవారే. అందులో ఇప్పుడు టాప్ లో కొనసాగుతున్నారు శేఖర్ మాస్టర్ మరియు జానీ మాస్టర్. వీరిద్దరికి ఈ షో ద్వారా అవకాశాలు వచ్చి.. ఇప్పుడు టాలీవడ్ లోని కొరియోగ్రాఫర్లలో మొదటి స్థానం కోసం పోటీ పడుతున్నారు. అయితే ఇందులో శేఖర్ మాస్టర్ ఈ ఢీలో కొరియోగ్రాఫర్ గా పనిచేసినప్పుడు సంపాదించిన క్రేజ్ కంటే.. జడ్జ్ గానే ఎక్కువ క్రేజ్ అనేది తెచ్చుకున్నాడు.

Advertisement

ఈ షో నుండి టాలీవుడ్ లోకి వెళ్లి.. అక్కడ నిరూపించుకొని.. ఆ తర్వాత మళ్ళీ ఇదే షోకు జడ్జ్ గా వచ్చాడు. అయితే శేఖర్ మాస్టర్ ఈ షోలో జడ్జ్ గా ఉన్నాని రోజులు.. ఢీ రేటింగ్స్ అనేవి ఓ రేంజ్ లో ఉండేవి. ఇందులో ఈయన చేసే కామెడీ కూడా బాగా పండేది. ఆలాంటి శేఖర్ మాస్టర్ ఎవరు ఊహించని విధంగా.. ఈ షో నుండి తప్పుకున్నారు. కానీ ఈయన ఎలా ఎందుకు చేసాడు అనేది అభిమానులకు అర్ధం కాలేదు. అయితే తాజాగా తాను ఢీ నుండి ఎందుకు తప్పుకున్నాడో శేఖర్ మాస్టర్ స్వయంగా వివరించాడు. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ తాను మొదట ఢీ నుండి తప్పుకోలేదు అని తెలిపాడు.

Advertisement

నాకు సినిమాలో ఎక్కువగా అవకాశాలు అనేవి వచ్చేసరికి ఢీకి కొంత బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యి.. మొదట బయటకు వచ్చాను. కానీ అదే సమయంలో నాకు మరో కార్యక్రమం కామెడీ స్టార్స్ నుండి ఆహ్వానం అనేది వచ్చింది. ఇందులో కూడా జడ్జ్ గా చేయాలనీ నన్ను కలిశారు. దానితో నేను ఈ షోకు ఓకే చెప్పి అగ్రిమెంట్ అనేది సైన్ చేశాను. అందుకే నేను ఢీ అనేది పూర్తిగా వదిలేయాల్సి వచ్చింది అని శేఖర్ మార్టర్ పేర్కొన్నాడు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ప్రతి హీరోకు కొరియోగ్రఫీ అనేది చేసిన శేఖర్ మాస్టర్.. ఇండస్ట్రీలో మంచి డిమాండ్ లో ఉన్నాడు అనేది నిజం.

ఇవి కూడా చదవండి :

గురువుకి వైన్ దక్షిణ ఇచ్చిన పంత్..!

పంత్ అనవసరంగా ఆ పని చేసాడు అంటున్న సెహ్వాగ్…!

Visitors Are Also Reading